Political News

రాహుల్ కి మంచి అస్త్రాలిస్తున్న మోడీ

మొదటి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీహార్ ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. కాకపోతే రాజకీయ నేతల ప్రసంగాలలకు, ఆరోపణలు, విమర్శలకు మామూలు అంశాలు సరిపోవన్నట్లుగా సైన్యాన్ని లాగుతుండటమే విచిత్రంగా ఉంది. ఆమధ్య భారత భూభాగంలోకి చైనా సైన్యాలు చొచ్చుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో గాల్వాన్ లోయలో జరిగిన గొడవలో భారత్ సైనికుడు 20 మంది చనిపోయారు. ఆ విషయమై తాజాగా ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ కీలక నేత రాహూల్ గాంధి ప్రధానమంత్రి నరేంద్రమోడిపై విరుచుకుపడ్డారు.

ఆమధ్య మోడి మాట్లాడుతూ మన భూభాగంలోకి చైనా సైన్యం అంగుళం కూడా చొరబడలేదంటు చేసిన ప్రకటనను రాహూల్ ప్రస్తావించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు మన సైన్యాన్ని అవమానించటమే అంటూ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. డ్రాగన్ సైన్యం మన భూభాగంలోకి చొరబడకపోతే మరి గొడవ ఎక్కడ జరిగింది ? మన సైనికులు 20 మంది ఎందుకు చనిపోయారు ? అంటూ రాహూల్ ప్రధానిని నిలదీశారు. రేయనకా, పగలనకా దేశానికి కాపలా కాస్తున్న ఆత్మస్ధైర్యం దెబ్బతినేలా మోడి వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపించారు.

మన భూభాగంలోకి చైనా సైన్యం 1200 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చినట్లు రాహూల్ తెలిపారు. ఒకవేళ చైనా సైన్యం చొరబాట్లకు దిగలేదంటే బహుశా ప్రధాని వాళ్ళని రమ్మని ఆహ్వానించినట్లుంది అంటూ ఎద్దేవా చేశారు. సైన్యం గురించి మాట్లాడటం మానేసి ముందు బీహార్ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మోడి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ సూటిగా ప్రశ్నించారు. రైతులు, కార్మికులు, సైనికులు, చిన్న వ్యాపారుల కోసమే పనిచేస్తానన్నారు. వాళ్ళ ముందు తలొంచుకుంటానని కూడా రాహూల్ చెప్పారు. కానీ ప్రధాని మాత్రం కేవలం అంబానీ, అదానీల కోసమే పనిచేస్తున్నట్లు రాహూల్ చురకలంటించారు. మొత్తం మీద బీహార్ ఎన్నికల వేడి మాత్రం పెరిగిపోతోంది.

This post was last modified on October 24, 2020 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago