ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న వైసీపీ. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చేశారు. రానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ తరఫున అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హోరాహోరీగా సాగనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ… అప్పటిదాకా 151 సీట్ల బలంతో బలీయంగా కనిపించగా… ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. సభలో 10 శాతం సీట్లుంటే తప్పించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో జగనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. నాడు టీడీపీకి 23 సీట్లుండగా… వాటిలోనే కొందరు ప్లేట్ ఫిరాయించేశారు. దీంతో మరో ఇద్దరు ముగ్గురు సభ్యులను తాము లాగేస్తే… టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కూడా జగన్ ఎద్దేవా చేశారు.
జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబోమని మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ చెప్పలేదు గానీ… తనకు ఎక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరేమోనని జగనే స్వయంగా అనుమానం వ్యక్తం చేశారు. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా నేత ఇవ్వాల్సిందేనని… అలా అయితేనే సీఎం హోదాలో చంద్రబాబుకు ఇచ్చిన సమయం తనకు కూడా లభిస్తుందని ఆయన వాదించారు. అలాంటి పరిస్థితి లేనప్పుడు తానెందుకు సభకు రావాలని జగనే వ్యాఖ్యానించారు. సభలో అవకాశం దక్కనప్పుడు బయట ఉండి మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
అయితే ఈలోగానే ఏమైందో తెలియదు గానీ.. జగన్ తన వ్యూహాన్ని మార్చేసుకున్నారు. ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు, ఆయనకు జైలులో పరామర్శ, గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాటామంతి, ఆపై మన్యం జిల్లాలో పాలవలస రాజశేఖరం కుటుంబానికి పరామర్శ… వరుసబెట్టి ఈ కార్యక్రమాలను చేపట్టిన జగన్ కు జనం నుంచి నీరాజనం లభించింది. జనం నుంచి తనకు వస్తున్న ఆదరణను చూసి అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మరి అసెంబ్లీలో ప్రభుత్వంపై జగన్ ఏ రీతిన పోరాటం సాగిస్తారో చూడాలి.
This post was last modified on February 22, 2025 7:04 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…