టీడీపీ యువ నేత, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు మరో కీలక బాధ్యత దక్కింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీఎస్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లోని తెలుగు ప్రజల వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. గత టీడీపీ హయాంలో ఏర్పాటు అయిన ఈ సంస్థ విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాకుండా ఆయా దేశాల్లోని తెలుగు ప్రజలు.. ప్రత్యేకించి ఏపీ ప్రజలు కలిసిమెలసి ఉండే దిశగా ఉత్తమంగా రాణించిందని చెప్పాలి.
ఇక కొండపల్లి విషయానికి వస్తే… ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరం జిల్లాలోని గజపతినగరం నుంచి మొన్నటి ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెనుకబడిన విజయనగరం జిల్లాకు చెందిన కొండపల్లి ఉత్తరాంధ్రలోనే తన పూర్తి స్థాయి విద్యాభ్యాసం కొనసాగించారు. కంప్యూటర్స్ సైన్స్ లో ఇంజినీరింగ్ పట్టా సాధించిన శ్రీనివాస్…ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. విద్యాభ్యాసం తర్వాత అక్కడే ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్ వేర్ సంస్థ ఒరాకిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొలువు సాదించారు. ఆపై వెనక్కు తిరిగి చూసుకోని శ్రీనివాస్.. ఒరాకిల్ తో ఏళ్ల తరబడి అనుబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో అమెరికా, అరబ్ దేశాల్లో కూడా ఆయన పనిచేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తగానూ రాణించిన తర్వాత మాతృభూమికి వచ్చారు. వచ్చీ రాగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవిని దక్కించుకున్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం, విదేశాల్లోనే ఉద్యోగం… ఔత్సాహిక పారిశ్రామికవేత్తగానూ అక్కడే సక్సెస్… వెరసి ఎన్నార్టీ వ్యవహారాల్లో కొండపల్లికి మంచి పట్టు ఉందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి?.. ఎక్కడ మనవాళ్లు రాణిస్తున్నారు?.. ఏఏ దేశాల్లో మనకు అవకాశాలు ఉన్నాయి?.. ఎలాంటి చర్యలు తీసుకుంటే విదేశాల్లో మనవాళ్లు రాణిస్తారు?.. అన్నవిషయాలపై కొండపల్లికి సంపూర్ణ అవగాహన ఉంది. అంతేకాకుండా సాష్ట్ వేర్ ఇంజినీర్ గా ఆయన ప్రస్థానం కూడా కొండపల్లికి ప్లస్సేనని చెప్పాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లు ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడిగా కొండపల్లికి కీలక బాధ్యతలు అప్పగించారు.
This post was last modified on February 22, 2025 11:07 am
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…