తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనలో ముస్లింలను బీసీల్లో కలపడంపై ఆమె నిప్పులు చెరిగారు. తాజాగా కరీంనగర్లో పర్యటించిన పురందేశ్వరి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మరింత వెనుకబాటుకు గురవుతోందన్నారు. పేదలు, వృద్ధులను కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వం వంచిస్తోందన్నారు.
కులగణనను తప్పుడు విధానంతో చేశారని పురందేశ్వరి విమర్శించారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరు స్తారన్నారు. ఈ విషయంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న ఆమె.. ఈ రూపంలో బిల్లును ఆమో దించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ… రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వంటి దేశనాయకుడిపై రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యానించి ఉండడం సరికాదన్నారు.
రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానపరచడమేనని పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించడం లేదన్నారు. కేంద్రం ఎంతో ఖర్చు పెట్టి అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకం తెలంగాణలో నిర్వీర్యమైందన్నారు. ఇక్కడ అమలు చేస్తే.. ఎంతో మంది ప్రజలకు ఆరోగ్యమేలు జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అడిగితే.. బీజేపీనేతపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్న ఆమె.. ప్రజల్లో కాంగ్రెస్పై రానురాను సానుభూతి కొరవడుతోందని చెప్పారు.
This post was last modified on February 21, 2025 4:05 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…