Political News

రేవంత్‌రెడ్డిపై పురందేశ్వరి హాట్‌ కామెంట్స్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కుల గ‌ణ‌న‌లో ముస్లింల‌ను బీసీల్లో క‌ల‌ప‌డంపై ఆమె నిప్పులు చెరిగారు. తాజాగా క‌రీంన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన పురందేశ్వ‌రి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో తెలంగాణ మ‌రింత వెనుక‌బాటుకు గురవుతోంద‌న్నారు. పేద‌లు, వృద్ధుల‌ను కూడా రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం వంచిస్తోంద‌న్నారు.

కుల‌గ‌ణ‌నను త‌ప్పుడు విధానంతో చేశార‌ని పురందేశ్వ‌రి విమ‌ర్శించారు. బీసీల్లో ముస్లింల‌ను ఎలా చేరు స్తార‌న్నారు. ఈ విష‌యంపై ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆమె.. ఈ రూపంలో బిల్లును ఆమో దించ‌డం క‌ష్ట‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌న్వ‌ర్టెడ్ బీసీ అంటూ… రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పైనా పురందేశ్వ‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని వంటి దేశ‌నాయ‌కుడిపై రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యానించి ఉండ‌డం స‌రికాద‌న్నారు.

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బీసీల‌ను అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మేనని పురందేశ్వ‌రి చెప్పారు. రాష్ట్రంలో పేద‌ల ఆరోగ్యానికి కూడా ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించ‌డం లేద‌న్నారు. కేంద్రం ఎంతో ఖ‌ర్చు పెట్టి అమ‌లు చేస్తున్న ‘ఆయుష్మాన్ భార‌త్‌’ ప‌థ‌కం తెలంగాణ‌లో నిర్వీర్య‌మైంద‌న్నారు. ఇక్క‌డ అమ‌లు చేస్తే.. ఎంతో మంది ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అడిగితే.. బీజేపీనేత‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న ఆమె.. ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్‌పై రానురాను సానుభూతి కొర‌వ‌డుతోంద‌ని చెప్పారు.

This post was last modified on February 21, 2025 4:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

9 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

11 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

40 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago