Political News

పవన్ ఫొటోల మార్ఫింగ్ పై కేసుల పరంపర

సోషల్ మీడియా యాక్టివిస్టులకు నిజంగానే ఎంత చెప్పినా… వారు చేస్తున్నతప్పేమిటన్నది తెలియరానట్టుంది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు అవతలి వారిని ఎంతటి మానసిక వేదనకు గురి చేస్తున్నాయన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసివచ్చింది. ఈ విషయాలపై స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా పలుమార్లు సంచలన వ్యాఖ్యలే చేసింది. అయినా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల వైఖరిలో లేశమాత్రం మార్పు కూడా రావట్లేదు. అందుకు నిదర్శనమే జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ః ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే దీనిపై ఏపీలో ఇప్పుడు వరుసబెట్టి కేసులు నమోదు అయిపోతున్నాయి.

ఇటీవలే ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత సతీసమేతంగా పవన్ మహా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. కుమారుడు అకీరా నందన్ తో కలిసి పవన్ దంపతులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ చొక్కా తీసి స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలు, వీడియోలను చేజిక్కించుకున్న కొందరు దుర్మార్గులు ఆ ఫొటోలను మార్ఫింగ్ చేశారు. హాస్య నటుడు సంపూర్ణేశ్ బాబు ఫొటోలతో పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వికృతానందం పొందుతున్నారు. ఈ ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్, జన సైనికులు రంగంలోకి దిగిపోయారు. పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి. ఆ ఫొటోలను వైరల్ చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై వరుసగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పవన్ మార్ఫింగ్ ఫొటోలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఫొటోలను హర్షవర్ధన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు మార్ఫింగ్ చేశాడని ప్రాథమికంగా గుర్తించారు. చిత్తూరులోని గ్రీమ్స్ పేటకు చెందిన ఇతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ లు పోటెత్తుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి పోలీస్ స్టేషన్ లో జనసైనికులు ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక చిత్తూరులోని 2 టౌన్ పీఎస్ లోనూ జనసైనికుల ఫిర్యాదుతో అతడిపై ఇంకో కేసు నమోదు అయ్యింది. జనసేన బలంగా ఉన్న తిరుపతిలోనూ ఆ పార్టీ శ్రేణుల ఫిర్యాదుతో హర్షవర్ధన్ పై కేసు నమోదు అయ్యింది. పరిస్థితి చూస్తే… శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ వ్యవహారంపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on February 21, 2025 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

20 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

50 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago