Political News

పవన్ ఫొటోల మార్ఫింగ్ పై కేసుల పరంపర

సోషల్ మీడియా యాక్టివిస్టులకు నిజంగానే ఎంత చెప్పినా… వారు చేస్తున్నతప్పేమిటన్నది తెలియరానట్టుంది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు అవతలి వారిని ఎంతటి మానసిక వేదనకు గురి చేస్తున్నాయన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసివచ్చింది. ఈ విషయాలపై స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా పలుమార్లు సంచలన వ్యాఖ్యలే చేసింది. అయినా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల వైఖరిలో లేశమాత్రం మార్పు కూడా రావట్లేదు. అందుకు నిదర్శనమే జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ః ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే దీనిపై ఏపీలో ఇప్పుడు వరుసబెట్టి కేసులు నమోదు అయిపోతున్నాయి.

ఇటీవలే ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత సతీసమేతంగా పవన్ మహా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. కుమారుడు అకీరా నందన్ తో కలిసి పవన్ దంపతులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ చొక్కా తీసి స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలు, వీడియోలను చేజిక్కించుకున్న కొందరు దుర్మార్గులు ఆ ఫొటోలను మార్ఫింగ్ చేశారు. హాస్య నటుడు సంపూర్ణేశ్ బాబు ఫొటోలతో పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వికృతానందం పొందుతున్నారు. ఈ ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్, జన సైనికులు రంగంలోకి దిగిపోయారు. పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి. ఆ ఫొటోలను వైరల్ చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై వరుసగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పవన్ మార్ఫింగ్ ఫొటోలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఫొటోలను హర్షవర్ధన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు మార్ఫింగ్ చేశాడని ప్రాథమికంగా గుర్తించారు. చిత్తూరులోని గ్రీమ్స్ పేటకు చెందిన ఇతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ లు పోటెత్తుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి పోలీస్ స్టేషన్ లో జనసైనికులు ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక చిత్తూరులోని 2 టౌన్ పీఎస్ లోనూ జనసైనికుల ఫిర్యాదుతో అతడిపై ఇంకో కేసు నమోదు అయ్యింది. జనసేన బలంగా ఉన్న తిరుపతిలోనూ ఆ పార్టీ శ్రేణుల ఫిర్యాదుతో హర్షవర్ధన్ పై కేసు నమోదు అయ్యింది. పరిస్థితి చూస్తే… శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ వ్యవహారంపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on February 21, 2025 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago