Political News

జగన్ పై కేసు ఓకే… లేని పేర్నినీ ఇరికించారట

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుంటూరు పరిధిలోని నల్లపాడు పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో జగన్ తో పాటు మరో 8 మంది వైసీపీ నేతల పేర్లను కూడా పోలీసులు చేర్చారు. అంటే… జగన్ తో కలిసి మొత్తంగా 9 మందిపై కేసు నమోదు అయిపోయిందన్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినా కూడా బుధవారం జగన్ గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు. జగన్ పర్యటన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టేనని నిర్ధారించిన పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా… పోలీసులు ఓ పొరపాటు చేశారట. బుధవారం జగన్ తో కలిసి వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలు మిర్చి యార్డుకు వెళ్లారు. వీరిలో ప్రధానమైన నేతల పేర్లను ఎంచుకుని పోలీసులు వారి పేర్లను కేసులో పొందుపరిచారు. ఈ పేర్లలో అంబటి రాంబాబు, కొడాలి నాని, మేరుగు నాగార్జున, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తులసి రఘురాం, నందిగం సురేశ లతో పాటుగా పేర్ని నాని పేరును కూడా పోలీసులు కేసులో చేర్చారు. అయితే పేర్ని నాని బుధవారం నాటి జగన్ కార్యక్రమానికే హాజరు కాలేదట. ఈ విషయాన్ని అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని షేర్ చేసిన అంబటి… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిర్చి యార్డు పర్యట సందర్భంగా వైఎస్ జగన్ మరో 8 మందిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన వైపు కన్నెత్తి చూడని పేర్ని నానిని కూడా ముద్దాయిగా చేర్చడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. అంబటి బయటపెట్టిన ఈ విషయాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకుని పేర్ని నానిని ఈ కేసు నుంచి తొలగిస్తారో, లేదో చూడాలి.

This post was last modified on February 21, 2025 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

31 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

50 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago