వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన సొంత జిల్లా కడపలో సర్కారీ, అటవీ భూములను దురాక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సజ్జల దురాక్రమణలపై ఫిర్యాదులు అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై సర్వే చేపట్టగా…అందులో వాస్తవం ఉందంటూ తేలింది. అయితే తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి భూ దురాక్రమణలకు పాల్పడలేదని చెబుతూ సజ్జల నేరుగా హైకోర్టునే ఆశ్రయించారు. దీంతో అధికారులు చేపట్టిన సర్వే నివేదికను తెప్పించుకున్న హైకోర్టు…మరోమారు సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే పంట భూములకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో కడప జిల్లా ఆర్డీఓ, జిల్లా అటవీ శాఖాధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్ట్స్ కు చెందిన అడిషనల్ డైరెక్టర్లతో కూడిన బృందం గురువారం సజ్జల భూములను రీసర్వే చేయనుంది. ఈ సర్వేలో శాస్త్రీయ పద్ధతులను అవలంభించి.. సజ్జల భూములుగా చెబుతున్న వాటిలో ఏమాత్రం అటవీ, సర్కారీ భూములు ఉన్నాయన్న విషయాన్ని నిక్కచ్చిగా నిగ్గు తేల్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే…కోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఈ రీసర్వేలో తేలే అంశాలనే హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సర్వేలో తేలే అంశాలనే ప్రభుత్వం కూడా అదికారికంగా పరిగణించనుంది. ఫలితంగా ఈ రీసర్వేపై అటు సజ్జలతో పాటు ఇటు అధికారుల బృందం ప్రత్యేక దృష్టి సారించాయి. అదే సమయంలో ఈ రీసర్వేపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొందని చెప్పాలి.
కడప జిల్లా పరిధిలో చింతకొమ్మదిన్నె మండలంలో కర్నూలు-కడప జాతీయ రహదారిని ఆనుకుని సజ్జల కుటుంబానికి పెద్దఎత్తున భూములు ఉన్నాయి. ఈ భూముల్లో సజ్జల ఓ ఫామ్ హౌజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఈ భూముల్లో సజ్జల సందీప్ రెడ్డి పేరిట 71.49 ఎకరాలు, సజ్జల జనార్ధన్ రెడ్డి పేరిట 16.85 ఎకరాలు, వై.సత్యసందీప్ కుమార్ రెడ్డి పేరిట 21.48 ఎకరాలు, సజ్జల విజయకుమారి పేరిట 146.75 ఎకరాల భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూముల్లో 55 ఎకరాల మేర ప్రభుత్వ, అటవీ శాఖల భూములున్నట్లు ఇదివరకటి సర్వేలో తేలింది. మరి గురువారం నాటి రీసర్వేలో ఆ మాట ఎంతమేర నిజమన్నది తేలనుంది.
This post was last modified on February 21, 2025 1:53 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…