Political News

ఇకపై ఎక్కడికెళ్లినా… ముందు కేడర్ తోనే లోకేశ్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఇకపై తాను నియోజకవర్గాల పర్యటనకు వస్తే… ముందుగా ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయన్న లోకేశ్… ఆ తర్వాతి కార్యక్రమాలు ఎంత ప్రాధాన్యత కలిగినవైనా కూడా ముందుగా మాత్రం కేడర్ తోనే భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంగా లోకేశ్ తొలుత పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే లోకేశ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

పార్టీ కార్యకర్తే పార్టీకి అధినేత అంటూ ఇటీవల లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వం కోటి మార్కును దాటిన సందర్భంగా లోకేశ్ చేసిన ఈ కామెంట్ పార్టీ కేడర్ ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. అంతేకాకుండా కేవలం మాటలు చెప్పడం వరకే కాకుండా తాను ఎక్కడికి వెళ్లినా పార్టీ కేడర్ కు ఆయన కొంత సమయాన్ని కేటాయిస్తున్న తీరుతోనూ పార్టీ కేడర్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే తీరును కొనసాగిస్తానన్న లోకేశ్ ప్రకటనతో తిరుపతి కేడర్ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన లోకేశ్… గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా చాలా మంది కార్యకర్తలు… తాము పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నా తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన తీరును గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో ఇకపై పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నేతలను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేశ్ చెప్పారు. అంతేకాకుండా తిరుపతి కేడర్ మీటింగ్ తోనే ఈ కార్యక్రమానికి కూాడా లోకేశ్ శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం కష్టపడ్డ కేడర్ కు లోకేశ్ ప్రోత్సాహక బహుమతులను అందించారు. పార్టీ కేడర్ ను గౌరవించాలని, వారికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కేడర్ లేకుంటే పార్టీనే ఉండదన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం కూడా పార్టీ కేడర్ కృషి వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. పార్టీ ప్రస్తుతం అటు కేడర్ పరంగా అయినా… ఇటు గెలుపు విషయంలో అయినా బలీయంగా ఉందన్ లోకేశ్.. ఇదే దూకుడును కొనసాగించాలన్నారు. ఏదో ఎన్నికల్లో గెలిచాం… ఎంజాయ్ చేద్దామంటే కుదరదని అటు నేతలతో పాటు ఇటు కేడర్ కు కూడా లోకేశ్ గుర్తు చేశారు.

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

2 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

2 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

4 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

5 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

5 hours ago