మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు ఈసీ, ఎన్నికల అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్, పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినా సరే చిత్తూరులో పుష్పగాడి రూల్ అన్నట్లు…గుంటూరులో జగన్ రూల్ అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్లుగానే జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. అనుమతి లేకుండా పర్యటించిందే కాకుండా పోలీసులు తనకు భద్రత కల్పించలేదంటూ వాపోయారు జగన్. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్ తోపాటు ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో పర్యటించిన అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఈసీ ఆదేశాలతో కేసు నమోదైంది. జగన్ టూర్ వల్ల మిర్చియార్డు ముందు గుంటూరు కొండమోడు మెయిన్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించి ప్రధాన రహదారిపై గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక, వైసీపీ నేతలు తమ వాహనాలకు రోడ్డుపక్కనే పార్క్ చేయడంతో యార్డుకు వచ్చే వాహనాలు కూడా రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో, మిర్చి యార్డులో పెట్టేందుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.
This post was last modified on February 20, 2025 6:01 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…