మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు ఈసీ, ఎన్నికల అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్, పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినా సరే చిత్తూరులో పుష్పగాడి రూల్ అన్నట్లు…గుంటూరులో జగన్ రూల్ అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్లుగానే జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. అనుమతి లేకుండా పర్యటించిందే కాకుండా పోలీసులు తనకు భద్రత కల్పించలేదంటూ వాపోయారు జగన్. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్ తోపాటు ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో పర్యటించిన అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఈసీ ఆదేశాలతో కేసు నమోదైంది. జగన్ టూర్ వల్ల మిర్చియార్డు ముందు గుంటూరు కొండమోడు మెయిన్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించి ప్రధాన రహదారిపై గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక, వైసీపీ నేతలు తమ వాహనాలకు రోడ్డుపక్కనే పార్క్ చేయడంతో యార్డుకు వచ్చే వాహనాలు కూడా రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో, మిర్చి యార్డులో పెట్టేందుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.
This post was last modified on February 20, 2025 6:01 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…