Political News

బ్రేకింగ్: జగన్ పై పోలీస్ కేసు!

మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు ఈసీ, ఎన్నికల అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్, పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయినా సరే చిత్తూరులో పుష్పగాడి రూల్ అన్నట్లు…గుంటూరులో జగన్ రూల్ అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్లుగానే జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. అనుమతి లేకుండా పర్యటించిందే కాకుండా పోలీసులు తనకు భద్రత కల్పించలేదంటూ వాపోయారు జగన్. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జగన్ తోపాటు ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో పర్యటించిన అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఈసీ ఆదేశాలతో కేసు నమోదైంది. జగన్ టూర్ వల్ల మిర్చియార్డు ముందు గుంటూరు కొండమోడు మెయిన్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించి ప్రధాన రహదారిపై గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక, వైసీపీ నేతలు తమ వాహనాలకు రోడ్డుపక్కనే పార్క్ చేయడంతో యార్డుకు వచ్చే వాహనాలు కూడా రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో, మిర్చి యార్డులో పెట్టేందుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.

This post was last modified on February 20, 2025 6:01 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్.. చైనా అద్భుత సృష్టి!

ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…

4 minutes ago

మంచి నిర్మాతకు దెబ్బ మీద దెబ్బ

తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…

41 minutes ago

బాబు మాటతో ఆక్వాకు భరోసా దక్కింది!

అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…

1 hour ago

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

3 hours ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

3 hours ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

3 hours ago