Political News

బ్రేకింగ్: జగన్ పై పోలీస్ కేసు!

మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు ఈసీ, ఎన్నికల అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్, పోలీసులు అనుమతి నిరాకరించారు.

అయినా సరే చిత్తూరులో పుష్పగాడి రూల్ అన్నట్లు…గుంటూరులో జగన్ రూల్ అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్లుగానే జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. అనుమతి లేకుండా పర్యటించిందే కాకుండా పోలీసులు తనకు భద్రత కల్పించలేదంటూ వాపోయారు జగన్. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జగన్ తోపాటు ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో పర్యటించిన అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఈసీ ఆదేశాలతో కేసు నమోదైంది. జగన్ టూర్ వల్ల మిర్చియార్డు ముందు గుంటూరు కొండమోడు మెయిన్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించి ప్రధాన రహదారిపై గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక, వైసీపీ నేతలు తమ వాహనాలకు రోడ్డుపక్కనే పార్క్ చేయడంతో యార్డుకు వచ్చే వాహనాలు కూడా రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో, మిర్చి యార్డులో పెట్టేందుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.

This post was last modified on February 20, 2025 6:01 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

24 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

46 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago