తెలంగాణలో ఇక రాజకీయం రసవత్తరంగా మారనుందా? విపక్ష బీఆర్ఎస్ మరింతగా చెలరేగిపోనుందా? అధికార కాంగ్రెస్ దూకుడుకు చెక్ పడిపోతుందా? క్రమంగా పుంజుకుంటున్న బీజేపీకి ఇక కష్టకాలమే రానుందా?… ఈ అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇందుకు కొంత సమయం పట్టినా… తెలంగాణ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు అయితే కనిపించనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర పెద్దగా బయటకు వచ్చిందే లేదు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా.. అప్పటిదాకా కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారులే అన్న వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టిన కేసీఆర్… బుధవారం బయటకు వచ్చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా పనిచేసే దిశగా ఆయన ఓ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్న వాదనలు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి.
బుధవారం ఉదయం ఎర్రవరి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ నేరుగా… సికింద్రాబాద్ వెళ్లారు. అక్కడ పాస్ పోర్టు ఆఫీస్ కు వెళ్లనున్న కేసీఆర్ తన పాస్ పోర్టును అప్ గ్రేడ్ చేయించుకుంటారు. ఆ తర్వాత నంది నగర్ లోని తన నివాసానాకి చేరుకుని… మధ్యాహ్న భోజనం తర్వాత తన ఇంటి నుంచి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ ప్రసంగంతో కేసీఆర్ దాదాపుగా ఏడాది కాలం తర్వాత తిరిగి రాజకీయంగా యాక్టివేట్ కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పీచ్ బీఆర్ఎస్ శ్రేణులను మంత్రముగ్ధులను చేయనుందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వైరి వర్గాలకు ఓ స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం మనం పిలుస్తున్న బీఆర్ఎస్… టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27 నాటికి సరిగ్గా 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించేందుకు కేసీఆర్ తీర్మానించారు. ఈ వేడుకలకు సన్నాహకంగానే బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు… వేడుకలకు వేదిక, జన సమీకరణ తదితర అంశాలన్నింటినీ కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా పార్టీ మరింతగా క్షీణించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…