కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి నగరం సోమవారం మహా కుంభ ఆప్ టెంపుల్స్ పేరిట ప్రారంభమైన సదస్సుతో ప్రత్యేక శోభను సంతరిచుకుంది. ఈ సభా వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ఇతర దేశాలకు చెందిన నగరాల్లోనూ వెంకన్న ఆలయాలను నిర్మిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
ఇంటర్నేషనల్ టెంపుల్స్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ ఎక్స్ పో సంస్థ నిర్వహించిన ఈ సదస్సుకు చంద్రబాబుతో పాటుగా మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్ లు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక ప్రసంగం చేసిన చంద్రబాబు… ఆధునిక సాంకేతికతను ఆలయాల నిర్వహణకు వినియోగించుకునే విషయంపై సమగ్ర చర్చ జరగడం ఆహ్వానించదగ్గ విషయమని తెలిపారు. ఏపీలోని ఆలయాల నిర్వహణను తమ ప్రభుత్వం పకడ్బందీగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
ఆయా ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడటంతో పాటుగా ఆలయాల విశిష్టతను భావి తరాలకు అందేలా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆలయాలను స్వయం సమృద్ధం చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఆలయాల ట్రస్ట్ బోర్డులను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించడంతో పాటుగా టెంపుల్ టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం కోసం స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టీటీడీ తరఫున మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు చంద్రబాబు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
This post was last modified on February 17, 2025 10:37 pm
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…