Political News

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

ప్రజల తరఫున ప్రశ్నించేందుకు జనసేన పార్టీని 11 సంవత్సరాల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్థాపించారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు పవన్. టీడీపీ, బీజేపీలతో కలిసి గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. 100 శాతం స్ట్రైక్ రేట్ తో తన పార్టీ తరఫున అందరినీ గెలిపించుకున్న పవన్ కల్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఏడాది జరగబోయే జనసేన ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ వేడుకల నిర్వహణపై జనసేన పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. జనసేన అధినేత పవన్ గెలుపొందిన పిఠాపురంలో ఈ వేడుక నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. 3 రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు. దాంతోపాటు, భవిష్యత్తులో జనసేనను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలపై కూడా చర్చించనున్నారు. ఏది ఏమైనా జనసేన ఘన విజయం తర్వాత జరగబోతున్న ప్లీనరీ కోసం జనసేన శ్రేణులు కూడా ఫుల్ జోష్ లో ఎదురుచూస్తున్నాయి. పార్టీ బలోపేతం, బూత్ లెవల్ లో సంస్థాగత నిర్మాణం గురించి పవన్ ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

Kumar

Recent Posts

పవన్ చెప్పినా అధికారులు వినట్లేదా…?

మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…

51 minutes ago

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 8 మంది దుర్మరణం

ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…

1 hour ago

ఇండియా కూటమి మీటింగ్‌కు విజయ్ దూరం.. కారణాలివే!

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…

2 hours ago

మేక‌పాటి ఫ్యామిలీలో ఆస్తుల ర‌చ్చ‌లో జగన్ పేరెందుకు?

నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ మేక‌పాటి కుటుంబంలో ఆస్తుల ర‌చ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి ప‌లువురు నాయ‌కులు…

3 hours ago

తమన్ జేబులో ఎనిమిది సినిమాలు

ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…

4 hours ago

“2027లో కేసీఆర్ బస్సు యాత్ర”

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…

4 hours ago