విజయవాడ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు కేశినేని నాని.. తిరిగి వైసీపీ గూటికి చేరుతారని.. గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో కాదు, మా పార్టీలోకి వస్తున్నారంటూ.. బీజేపీ నాయకులు కూడా అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.
వైసీపీలోకి రావాలని నాని ప్రయత్నిస్తున్నారని.. వైసీపీ శిబిరం నుంచి లీకులు వస్తున్నాయి. ఆయనకు, జగన్కు మధ్య గట్టి అనుబంధం ఉందని.. ఈ క్రమంలో తిరిగియాక్టివేట్ అవుతున్నారన్నది వైసీపీ నేతల మాట.
ఇక, బీజేపీ అగ్రనాయకులు నితిన్ గడ్కరీ, అమిత్షా వంటివారితో నానికీ ప్రత్యేక అనుబంధం ఉందని.. ఈ నేపథ్యంలో నాని త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారంటూ.. ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అయితే.. తాజాగా ఈ వ్యాఖ్యలపై నాని రియాక్ట్ అయ్యారు. “నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేస్తున్నాను. గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికం గా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు“ అని నాని తాజాగా ప్రకటించారు.
అంతేకాదు.. తాను రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని హృదయపూర్వకంగా నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్న నాని… సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని స్పష్టం చేశారు.
`విజయవాడలోని నా తోటి పౌరుల శ్రేయస్సు.. నా లోతైన అంకితభావంతో ముడిపడి ఉంది. నా రాజకీయ పునరాగమనానికి సంబంధించి నిరాధారమైన వార్తలను విస్మరించమని నేను అందరినీ కోరుతున్నాను. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దానిలోని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే నా దృష్టి ఉంది“ అని నాని పేర్కొన్నారు.
కాగా.. గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాని ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం.. రాజకీయంగా దూరమవుతున్నట్టు ప్రకటించారు.
This post was last modified on February 17, 2025 1:38 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…