Movie News

తెలుగు సినిమా సెట్లో ఎగతాళి చేశారు : శ్వేత బసు

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది ముంబయి భామ శ్వేత బసు ప్రసాద్. బాలనటిగా బాలీవుడ్ క్లాసిక్ ‘ఇక్బాల్’లో నటించిన ఆమె హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది ‘కొత్త బంగారు లోకం’తోనే. ఈ సినిమాలో ‘ఎకాడా..’ అంటూ ఆమె చెప్పిన డైలాగులకు యూత్ ఫిదా అయిపోయారు. చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించిందామె.

కానీ ఈ సినిమా తర్వాత శ్వేతకు వరుసగా అవకాశాలు వచ్చినా.. అవి పెద్దగా ఉపయోగపడలేదు. ‘రైడ్’ మినహా తెలుగులో తర్వాత నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లు కావడం.. మధ్యలో ఓ కాంట్రవర్శీ ఆమెను చుట్టుముట్టడంతో టాలీవుడ్‌ను ఖాళీ చేసి ముంబయికి వెళ్లిపోయింది. అక్కడే హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది.

ఐతే తెలుగులో నటించి బాలీవుడ్‌కు వెళ్లిపోయాక ఇక్కడి సినిమాలు, ఇండస్ట్రీ గురించి విమర్శలు చేయడం చాలామంది హీరోయిన్లకు అలవాటే. శ్వేత కూడా ఇప్పుడు అదే చేసింది.

ఒక తెలుగు సినిమా సెట్‌లో తనను హీరో సహా అందరూ ఎగతాళి చేసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది శ్వేత. ‘‘కెరీర్ పరంగా ఇబ్బందిపడ్డ సందర్బాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్లో చాలా అసౌకర్యానికి గురయ్యా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువ ఉన్నానని ప్రతి ఒక్కరూ ఎగతాళి చేశారు. హీరో ఆరడుగులుంటే నేను ఐదడుగులే ఉన్నానని అనేవారు. ఇక ఆ హీరో వల్ల కూడా చాలా ఇబ్బంది అయింది.

అతను ప్రతి సీన్ మార్చేస్తూ ఉండేవాడు. నాకు తెలుగు రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పేదాన్ని. కానీ అతను తెలుగువాడే అయినా తన మాతృభాషలో డైలాగులు సరిగా చెప్పలేకపోయేవాడు. పైగా నా కంట్రోల్‌లో లేని నా హైట్ గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది. అందుకు నేనేం చేయగలను? నాకు తెలిసి నేను చాలా బాధ పడ్డ సినిమా సెట్ అంటే అదే’’ అని శ్వేత బసు చెప్పింది.

శ్వేత చివరగా తెలుగులో 2018లో వచ్చిన ‘విజేత’లో నటించింది. అందులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించాడు.

This post was last modified on February 17, 2025 2:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sweta Basu

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago