Political News

వెంకయ్య… ఇంకా యమా యాక్టివ్ గా ఉన్నారు!

ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేెక గుర్తింపును సంపాదించుకున్న తెలుగు నేత. బీజేపీతో రాజకీయం మొదలుపెట్టి… బీజేపీతోనే రాజకీయాలకు స్వస్తి పలికిన మన నెల్లూరు జిల్లా నేత. దేశ ద్వితీయ పౌరుడిగా ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలు అందించారు.

ఎప్పుడో 1949లో జన్మించిన వెంకయ్య.. ఈ జూలై వస్తే 75 ఏళ్ల వయసును పూర్తి చేసుకుంటారు. అయితేనేం… ఆయన ఇప్పటికీ యమా యాక్టివ్ గా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత పూర్తిగా విశ్రాంతి మోడ్ లోకి వెళ్లిన వెంకయ్య…ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నారు.

తాజాగా తన మనవడు. విష్ణు వివాహం సాత్వికతో జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ను ఆదివారం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలో వెంకయ్య కుమార్తె ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఘనంగా జరిగింది.

ఈ రిసెప్షన్ కు పలువురు రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

తన మనవడి పెళ్లి రిసెప్షన్ కు వచ్చిన ప్రముఖులను రిసీవ్ చేసుకుంటూ… వారితో మాట కలుపుతూ వెంకయ్య ఫుల్ జోష్ లో కనిపించారు. 75 ఏళ్ల వయసులో ఉన్న వెంకయ్య… ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. తనను పలకరించేందుకు వచ్చిన నేతలతో కలిసి నిలబడే మాట్లాఃడిన వెంకయ్య వారితో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

రాజకీయాల్లో ఉండగా…ఎంతగా యాక్టివ్ గా కనిపించారో…. ఇప్పుడు కూడా వెంకయ్య అంతే యాక్టివ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వయసు మీద పడిన వైనం ఆయన ముఖంలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

This post was last modified on February 16, 2025 8:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

39 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago