జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర శనివారం పూర్తి అయ్యింది. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడుల్లో జరిగిన ఈ యాత్రలో పవన్ తన తనయుడు అకీరా నందన్ తో కలిసి సాగారు.
తొలుత కేరళకు వెళ్లిన పవన్ అక్కడి నుంచి తన యాత్రను మొదలుపెట్టి… ఆ తర్వాత తమిళనాడు చేరుకున్నారు.. తమిళనాడులోనూ తాను నిర్దేశించుకున్న ఆలయాలను సందర్శించిన పవన్ శనివారం మద్యాహ్నం తన యాత్రను ముగించారు.
3 రోజుల పాటు కొనసాగిన పవన్ ఆద్మాత్మిక యాత్ర ముగిసినంతనే పవన్ నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అనంతరం గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వాస్తవానికి యాత్రకు బయలుదేరే ముందు పవన్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే.
అనారోగ్యం కారణంగా యాత్రకు ముందు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న పవన్… అటు నుంచి అటే యాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం విధులకు పవన్ కొన్ని రోజులుగా దూరంగా ఉన్నట్లే లెక్క.
అయితే తంజావూరులో యాత్రను ముగించుకున్న పవన్ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నా కూడా… అలా కాకుండా గన్నవరం చేరుకున్నారు. అంటే… అనారోగ్యం, ఆధ్యాత్మిక యాత్ర పేరిట కొన్నాళ్లు డ్యూటీకి దూరంగా ఉన్న తాను మరింత కాలం పాటు విధులకు దూరంగా ఉండదలచుకోని పవన్… వెనువెంటనే డ్యూటీలోకి దిగిపోయేందుకే నేరుగా గన్నవరం చేరుకున్నారని చెప్పాలి.
శనివారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ లో సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి పవన్ పాలుపంచుకోనున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 15, 2025 7:09 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…