వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తొలిసారిగా స్పందించారు. శనివారం విశాఖ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ఆయన స్పందనను కోరారు.
దీంతో వంశీ అరెస్టుపై స్పందించిన లోకేశ్… అంతా చట్టబద్ధంగానే జరుగుతోందని, చట్ట ప్రకారమే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని కూడా ఆయన వెల్లడించారు.
వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని లోకేశ్ గుర్తు చేశారు. ఆ తర్వాత గన్నవరంలోని పార్టీ కార్యాలయంపైనా దాడి జరిగిందన్నారు. ఇలా అనునిత్యం టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, తమపై దాడులు చేయడం వైసీపీ పనిగా పెట్టుకుని పాలన సాగించిందని ఆరోపించారు.
ఈ దాడులను చూసి.. ఆనాడే తాను ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఓ మాటిచ్చానని లోకేశ్ గుర్తు చేశారు. చట్ట వ్యతిరేకంగా అరెస్టులు, దాడులకు పాల్పడ్డ వైసీపీ శ్రేణులతో పాటుగా అదికారులను చట్టానికి లోబడి శిక్షిస్తామని తన యువగళం పాదయాత్ర బహిరంగ సభల్లో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆ మేరకే ఇప్పుడు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కూడా లోకేశ్ చెప్పుకొచ్చారు.
టీడీపీ గన్నవరం కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదు చేసిన దళిత యువకుడిపై బెదిరింపులకు పాల్పడి… కేసును విత్ డ్రా చేసుకునేలా మాజీ ఎమ్మెల్యే వ్యవహరించారని లోకేశ్ ఆరోపించారు. ఈ వ్యవహారం బయటపడిన కారణంగానే…చట్టబద్దంగా తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, అందులో బాగంగానే అరెస్టు జరిగిందని ఆయన తెలిపారు.
ఈ వ్యవహారంలో అన్ని నిజాలను బయటకు తీస్తామని చెప్పిన లోకేశ్… ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే,… ఈ కేసుపై మాట్లాడినంత సేపు లోకేశ్ నోట నుంచి వంశీ పేరు ప్రస్తావనకే రాకపోవడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే అని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించిన లోకేశ్… వంశీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడలేదని చెప్పాలి.
This post was last modified on February 15, 2025 6:45 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…