టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దేనిపై అయినా దృష్టి పెడితే… అది పూర్తి అయ్యే దాకా వదిలిపెట్టరు. అది రాజకీయం అయినా కావచ్చు. లేదంటే సంక్షేమ కార్యక్రమం అయినా కావచ్చు. చివరకు ఎవరికైనా చేయూత అందించే విషయం అయినా కావచ్చు.
ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా లోకేశ్ వెనుకంజ వేయరనే చెప్పాలి. అలా సాగుతున్న లోకేశ్ చొరవ కారణంగా ఎక్కడో విదేశాల్లో చనిపోయిన ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు దాదాపుగా 15 రోజుల తర్వాత వారి స్వస్థలాలకు చేరాయి.
గుంటూరు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, చెట్టూరి భార్గవ్ లు కొంతకాలం క్రితం విద్యాభ్యాసం నిమిత్తం ఐర్లాండ్ వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. ఈ విషయంపై ఐర్లాండ్ లోని తెలుగు సమాజం వేగంగానే స్పందించింది.
బాధిత కుటుంబాలకు సమాచారం చేరవేయడతో పాటుగా మృతదేహాలకు జరగాల్సిన తదనంతర కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా మృతదేహాలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు అవసరమైన నిధుల సమీకరణను కూడా మొదలుపెట్టింది.
అయితే అమెరికాలో మాదిరిగా ఐర్లాండ్ లో తెలుగు జనం అంత ఎక్కువగా లేరు కదా. నిధుల సమీకరణ కష్టంగా మారింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఐర్లాండ్ తెలుగు సమాజం… ఈ విషయాన్ని నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లింది. బాధితుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు సహకరించాలని ఆయనను కోరింది.
ఈ దిశగా సురేశ్, భార్గవ్ ఇద్దరూ చనిపోయిన రోజే సమాచారం అందుకున్న లోకేశ్… తన యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేందుకు కొంత సమయ పట్టింది. చివరకు శనివారం సురేశ్, భార్గవ్ మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరాయి. ఈ విషయాన్ని లోకేశ్ టీం స్వయంగా ప్రకటించింది.
This post was last modified on February 15, 2025 2:00 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…