Political News

పిల్లలను చివరిసారి చూడాలన్న తల్లి తండ్రుల కోరికను నెరవేర్చిన లోకేష్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దేనిపై అయినా దృష్టి పెడితే… అది పూర్తి అయ్యే దాకా వదిలిపెట్టరు. అది రాజకీయం అయినా కావచ్చు. లేదంటే సంక్షేమ కార్యక్రమం అయినా కావచ్చు. చివరకు ఎవరికైనా చేయూత అందించే విషయం అయినా కావచ్చు.

ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా లోకేశ్ వెనుకంజ వేయరనే చెప్పాలి. అలా సాగుతున్న లోకేశ్ చొరవ కారణంగా ఎక్కడో విదేశాల్లో చనిపోయిన ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు దాదాపుగా 15 రోజుల తర్వాత వారి స్వస్థలాలకు చేరాయి.

గుంటూరు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, చెట్టూరి భార్గవ్ లు కొంతకాలం క్రితం విద్యాభ్యాసం నిమిత్తం ఐర్లాండ్ వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిద్దరూ చనిపోయారు. ఈ విషయంపై ఐర్లాండ్ లోని తెలుగు సమాజం వేగంగానే స్పందించింది.

బాధిత కుటుంబాలకు సమాచారం చేరవేయడతో పాటుగా మృతదేహాలకు జరగాల్సిన తదనంతర కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా మృతదేహాలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు అవసరమైన నిధుల సమీకరణను కూడా మొదలుపెట్టింది.

అయితే అమెరికాలో మాదిరిగా ఐర్లాండ్ లో తెలుగు జనం అంత ఎక్కువగా లేరు కదా. నిధుల సమీకరణ కష్టంగా మారింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఐర్లాండ్ తెలుగు సమాజం… ఈ విషయాన్ని నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లింది. బాధితుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు సహకరించాలని ఆయనను కోరింది.

ఈ దిశగా సురేశ్, భార్గవ్ ఇద్దరూ చనిపోయిన రోజే సమాచారం అందుకున్న లోకేశ్… తన యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేందుకు కొంత సమయ పట్టింది. చివరకు శనివారం సురేశ్, భార్గవ్ మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరాయి. ఈ విషయాన్ని లోకేశ్ టీం స్వయంగా ప్రకటించింది.

This post was last modified on February 15, 2025 2:00 pm

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

17 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

35 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago