కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు… అప్పుడే ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న వీఐపీల జాబితాలోకి చేరిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలకు ముందే విజయ్ కి ఈ మాదిరి ఎలివేషన్ వచ్చేసిందంటూ ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
తమిళగ వెట్రి కజగమ్ పేరిట గతేడాది ఆగస్టులో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్… ఇప్పటిదాకా ఎన్నికల బరిలోకి దిగలేదు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
అయినా ఎన్నికలు జరగకుండా… ఎన్నికల్లో పోటీ చేయకుండా విజయ్ కి నేరుగా కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించే స్థాయి ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే… సినిమాల్లో ఉన్నంతకాలం విజయ్ కి పెద్దగా బెదిరింపులు ఎదురు కాలేదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్…తన సొంత సెక్యూరిటీతోనే ఇప్పటిదాకా సాగారు.
అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారో…ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయట. ఇటీవలి కాలంలో సదరు బెదిరింపులు మరింతగా ఎక్కువయ్యాయట. ఇదే విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదించాయట.
నిఘా వర్గాల నివేదికను పరిశీలించిన కేంద్రం వై కేటగిరీ భద్రతను విజయ్ కి కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయగా… ఒకటి, రెండు రోజుల్లోనే సదరు భద్రత విజయ్ కి అందనుంది. వై కేటగిరీ భద్రత కింద విజయ్ కు 8 మందితో కూడిన భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు. వీరిలో ఇద్దరు కమెండోలు కాగా… మిగిలిన వారు స్థానిక పోలీసులు ఉండనున్నారు.
విజయ్ కు ఈ భద్రతను కల్పించిన కేంద్రం… ఓ కండీషన్ ను కూడా పెట్టింది. విజయ్ తమిళనాడులో పర్యటించినప్పుడే మాత్రమే ఈ కేటగిరి భద్రత ఆయనకు లబిస్తుందట. తమిళనాడు దాటితే ఆయనకు ఈ భద్రత వర్తించదని కేంద్రం తన ఉత్వర్లుల్లో పేర్కొంది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…