Political News

నారా లోకేశ్… ఓ ట్రెండ్ సెట్టర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిజంగానే ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రత్యర్థులతో రాజీకి పయత్నిస్తే… అతడిని చూపించి టార్చ్ బేరర్ అంటే ఇలానే ఉంటాడంటూ సదరు సినిమాలోని ఓ పాత్ర అదిరేటి డైలాగ్ చెబుతుంది. అది సినిమా. ఏం చెప్పినా… ఏది చేయాలనుకున్నా జరిగిపోతుంది. నిజ జీవితంలో అయితే అలా కాదు కదా. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అకుంఠిత దీక్ష కావాలి. పట్టు వదలని కృషి దానికి తోడవ్వాలి. వాటికి అత్యంత కీలకమైన సమయం కూడా కావాలి. వీటిన్నింటినీ సమకూర్చుకుని లోకేశ్ నిజంగానే టార్చ్ బేరర్ లా నిలబడ్డారు. రాజకీయాల్లో ఉన్న వారందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయా పార్టీలు తమ శ్రేణులను ఎంత బాగా చూసుకెోవాలో, ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు అండగా ఎలా నిలబడాలో చూపించారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణుల మీద పెద్ద ఎత్తున వేదింపులు జరిగాయి. దాడులు జరిగాయి. అవమానాలకు అయితే లెక్కే లేదని చెప్పాలి. టీడీపీ కార్యకర్తలు ఆస్తులు కోల్పోయారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. అలాంటి పార్టీ శ్రేణులకు ఊరిపి ఊదే దిశగా లోకేశ్ కీలక అడుగు వేశారు. మనపై దాడులు, అకృత్యాలకు పాల్పడే వైసీపీ నేతలు, కేసులతొ వేధించే అధికారుల పేర్లను రాసుకునేందుకు ఓ రెడ్ బుక్ ను ఏర్పాటు చేసుకుందామని పిలుపు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్ లోని వారి సంగతి తేలుద్దామని… అది కూడా చట్టబద్ధంగానే ఆ చర్యలు చేపడదామని అన్నారు.

లోకేశ్ నుంచి వినిపించిన ఈ మాట టీడీపీటో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2024 ఎన్నికల్లో పార్టీకి రికార్డు విక్టరీని అందించింది. అనుకున్నట్లుగానే… లోకేశ్ తన రెడ్ బుక్ ను ఓపెన్ చేసి వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడ్డ వారిని వరుసబెట్టి చట్టం ముందు దోషులుగా నిలబెట్టే పనికి శ్రీకారం చుట్టారు. ఈ తరహా లోకేశ్ వ్యవహార సరళి… ఆయన చేతిలో చిత్తుగా ఓడిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆకట్టుకుంది. మీరు రెడ్ బుక్ రాస్తే… మేం వైట్ బుక్ రాస్తామంటూ ఆ మధ్య జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణుల నుంచి సెటైర్లు పేలాయి.

తాజాగా టీడీపీ అన్నా… ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నా..నారా లోకేశ్ అన్నా… నిత్యం విషం చిమ్మే తెలంగాణ విపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు లోకేశ్ ను అనుసరిస్తోంది. లోకేశ్ నడిచిన బాటలోనే తామూ నడుస్తామంటూ చెబుతోంది. ఈ మేరకు లోకేశ్ రెడ్ బుక్ ను ప్రస్తావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తాము పింక్ బుక్ తెరుస్తామంటూ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్షాలపై దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించిన కవిత… వాటన్నింటినీ రికార్డు చేసుకునేందుకు తాము కూడా లోకేశ్ మాదిరిగా పింక్ బుక్ ను రాస్తామని తెలిపారు. అంతేకాకుండా లోకేశ్ మాదిరిగానే…తాము అధికారంలోకి రాగానే తమ పింక్ బుక్ లో ఉన్న వారి సంగతి తేలుస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

This post was last modified on February 14, 2025 12:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: BRSLokesh

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago