Political News

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధింపు

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

మణిపూర్ లో అధికార పార్టీగా బీజేపీనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వాస్తవానికి మణిపూర్ లో జాతుల వైరం నేపథ్యంలో గత కొంత కాలంగా అట్టుడుకుతోంది. పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల మీద కూడా అక్కడ దాడులు జరిగాయి.

మొత్తంగా అక్కడి పరిస్థితులు దారుణ స్థితికి అద్దంగా నిలిచాయి. అయినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ఇతర కేంద్ర మంత్రులు గానీ… మణిపూర్ హింసపై నోరే మెదపలేదని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. మణిపూర్ లో బీజేపీ సీఎం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశాయి.

విపక్షాల ఆరోపణలు తనకు ఎంతమాత్రం వినిపించలేదన్న ధోరణిలో సాగిన బీజేపీ… ఢిల్లీ ఎన్నికలు ముగిసే దాకా సైలెంట్ గానే సాగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాదించినంతనే మణిపూర్ అంశంపై దృష్టి సారించిన బీజేపీ అగ్ర నేతలు… బీరేన్ సింగ్ తో రాజీనామా చేయించారని తెలుస్తోంది.

రాజీనామాకు ముందు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను విధించిన కేంద్రం… అక్కడి పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించనుందన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on February 13, 2025 7:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వెటకారం వెన్నతో పెట్టిన విద్య… అయినా సారీ: పృథ్వీరాజ్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా పై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడిందని…

18 minutes ago

ఒక్క వారంలో బెంగళూరుకు జగన్ రెండు టూర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకనో గానీ... లండన్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉండేందుకు…

27 minutes ago

గౌతమ్ & చరణ్ – ఎవరు అన్ లక్కీ

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్…

41 minutes ago

మూడో భారతీయుడుకి తలుపులు తీశారు

కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో భారతీయుడు 2 ఒకటి. ఎప్పుడో పాతికేళ్ల…

1 hour ago

తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ సెంటర్లు

ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు…

3 hours ago

పుష్కరం తర్వాత ‘సిరిమల్లె చెట్టు’ దర్శనం

గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే…

4 hours ago