కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మణిపూర్ లో అధికార పార్టీగా బీజేపీనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వాస్తవానికి మణిపూర్ లో జాతుల వైరం నేపథ్యంలో గత కొంత కాలంగా అట్టుడుకుతోంది. పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల మీద కూడా అక్కడ దాడులు జరిగాయి.
మొత్తంగా అక్కడి పరిస్థితులు దారుణ స్థితికి అద్దంగా నిలిచాయి. అయినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ఇతర కేంద్ర మంత్రులు గానీ… మణిపూర్ హింసపై నోరే మెదపలేదని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. మణిపూర్ లో బీజేపీ సీఎం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశాయి.
విపక్షాల ఆరోపణలు తనకు ఎంతమాత్రం వినిపించలేదన్న ధోరణిలో సాగిన బీజేపీ… ఢిల్లీ ఎన్నికలు ముగిసే దాకా సైలెంట్ గానే సాగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాదించినంతనే మణిపూర్ అంశంపై దృష్టి సారించిన బీజేపీ అగ్ర నేతలు… బీరేన్ సింగ్ తో రాజీనామా చేయించారని తెలుస్తోంది.
రాజీనామాకు ముందు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను విధించిన కేంద్రం… అక్కడి పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించనుందన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 13, 2025 7:57 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…