ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య శాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం మొదలు అయ్యేలోగానే డీఎస్సీ నియామకాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పిన సంగతీ తెలిసిందే. లోకేష్ ప్రకటనకు అనుగుణంగానే పాఠశాల విద్య శాఖ మెగా డీఎస్సీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఆ శాఖ ఏకంగా మెగా డీఎస్సీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
విద్య శాఖ ప్రకటన ప్రకారం.. మార్చి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే దరఖాస్తుల స్వీకరణ… డీఎస్సీ నిర్వహణ, ఫలితాల విడుదల వంటి వాటిని నిర్దేశిత సమయంలోగా పూర్తీ చేసి… జూన్ నెల ప్రథమార్ధంలోనే ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. అంటే.. లోకేష్ చెప్పినట్టుగానే.. జూన్ మాసంలో పాఠశాలలు తెరిచేలోగా కొత్త ఉపాధ్యాయులు తమకు కేటాయించిన బడుల్లో విధుల్లో చేరిపోతారన్న మాట. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ మెగా డీఎస్సీలో మొత్తంగా 16,247 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)- 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి. ఇక అభ్యర్థులు భయపడుతున్న జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని శశిధర్ పేర్కొన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యాప్ లు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్ గా మార్చేశామని కూడా ఆయన తెలిపారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…