Political News

ఏపీలో జూన్ లోగా విధుల్లోకి కొత్త టీచర్లు!

ఏపీలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం అయిపోయింది. మెగా డీఎస్సీఫై ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య శాఖా మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం మొదలు అయ్యేలోగానే డీఎస్సీ నియామకాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పిన సంగతీ తెలిసిందే. లోకేష్ ప్రకటనకు అనుగుణంగానే పాఠశాల విద్య శాఖ మెగా డీఎస్సీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఆ శాఖ ఏకంగా మెగా డీఎస్సీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది.

విద్య శాఖ ప్రకటన ప్రకారం.. మార్చి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే దరఖాస్తుల స్వీకరణ… డీఎస్సీ నిర్వహణ, ఫలితాల విడుదల వంటి వాటిని నిర్దేశిత సమయంలోగా పూర్తీ చేసి… జూన్ నెల ప్రథమార్ధంలోనే ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. అంటే.. లోకేష్ చెప్పినట్టుగానే.. జూన్ మాసంలో పాఠశాలలు తెరిచేలోగా కొత్త ఉపాధ్యాయులు తమకు కేటాయించిన బడుల్లో విధుల్లో చేరిపోతారన్న మాట. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ మెగా డీఎస్సీలో మొత్తంగా 16,247 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లు (ఎస్‌జీటీ)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (పీజీటీ)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)- 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి. ఇక అభ్యర్థులు భయపడుతున్న జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని శశిధర్ పేర్కొన్నారు. గ‌తంలో టీచ‌ర్లకు 45 ర‌కాల యాప్ లు ఉండేవ‌ని, వాటన్నింటినీ క‌లిపి ఒకే యాప్ గా మార్చేశామ‌ని కూడా ఆయన తెలిపారు.

This post was last modified on February 12, 2025 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

2 minutes ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

36 minutes ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

2 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

5 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

5 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

5 hours ago