టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అమరావతిలోని సచివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లోని సమస్యలు, వాటి పరిష్కారాలపైనా చంద్రబాబు ద్రుష్టి సారించారు. గతంలోకంటే కాస్తంత భిన్నంగా సాగిన ఈ సమావేశంలో… ఆయా శాఖలకు చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాలను కూడా సూచించారు.
దాదాపుగా అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా అయితే.. సమావేశాలకు ముఖ్య నేతలు ఒకింత ఆలస్యంగా వస్తూ ఉంటారు. ఆలోగా అధికారులు, ఇతరత్రా సిబ్బందితో పాటుగా మంత్రులు పూర్తిగా సర్దుకునే అవకాశం ఇవ్వాలన్న దిశగా ఆలోచించే ముఖ్య నేతలు కావాలనే ఆలస్యంగా వస్తూ ఉంటారు. అయితే… సమయ పాలనలో నిక్కచ్చిగా ఉండే చంద్రబాబు అలాంటి ఫార్మాలిటీలకు దూరంగా ఉంటారు కదా. ఈ సమావేశం విషయంలోనూ చంద్రబాబు నిర్దేశిత సమయానికే సమావేశ మందిరానికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా చాలా మంది మంత్రులు, అధికారులు రాలేదు.
సరే… ఎలాగూ సమావేశనికి మంత్రులు, అధికారులు రావాల్సిందే కదా. నిర్దేశిత సమయాన్ని వారికి ముందే చెప్పేశాం కదా అన్న భావనతో తన సీట్లో కూర్చున్న చంద్రబాబు… రావాల్సిన మంత్రులు, అధికారుల కోసం ఎదురు చూశారట. చంద్రబాబు వచ్చిన తర్వాత 10 నిమిషాలకు గాని మిగిలిన మంత్రులు, అధికారులు నెమ్మదిగా సమావేశ మందిరానికి చేరుకున్నారట. అయితే అప్పటికే… అక్కడకు చంద్రబాబు వచ్చి కూర్చున్న ఫైనాన్ని చూసినంతనే… మంత్రులు, అధికారులు బిత్తరపోయారట. ఎందుకంటే… సమయ పాలన పాటించని వారిపై చంద్రబాబు ఏ రీతిన కోప్పడతారన్న విషయం తెలిసిన వారంతా హడలిపోయారట. వారిలోని భయాన్ని గుర్తించిన చంద్రబాబు… ఈ సారి అయినా కాస్తంత సమయ పాలన పాటించండి అంటూ సుతిమెత్తగానే మందలించారట.
This post was last modified on February 12, 2025 4:18 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…