టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అమరావతిలోని సచివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లోని సమస్యలు, వాటి పరిష్కారాలపైనా చంద్రబాబు ద్రుష్టి సారించారు. గతంలోకంటే కాస్తంత భిన్నంగా సాగిన ఈ సమావేశంలో… ఆయా శాఖలకు చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాలను కూడా సూచించారు.
దాదాపుగా అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా అయితే.. సమావేశాలకు ముఖ్య నేతలు ఒకింత ఆలస్యంగా వస్తూ ఉంటారు. ఆలోగా అధికారులు, ఇతరత్రా సిబ్బందితో పాటుగా మంత్రులు పూర్తిగా సర్దుకునే అవకాశం ఇవ్వాలన్న దిశగా ఆలోచించే ముఖ్య నేతలు కావాలనే ఆలస్యంగా వస్తూ ఉంటారు. అయితే… సమయ పాలనలో నిక్కచ్చిగా ఉండే చంద్రబాబు అలాంటి ఫార్మాలిటీలకు దూరంగా ఉంటారు కదా. ఈ సమావేశం విషయంలోనూ చంద్రబాబు నిర్దేశిత సమయానికే సమావేశ మందిరానికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా చాలా మంది మంత్రులు, అధికారులు రాలేదు.
సరే… ఎలాగూ సమావేశనికి మంత్రులు, అధికారులు రావాల్సిందే కదా. నిర్దేశిత సమయాన్ని వారికి ముందే చెప్పేశాం కదా అన్న భావనతో తన సీట్లో కూర్చున్న చంద్రబాబు… రావాల్సిన మంత్రులు, అధికారుల కోసం ఎదురు చూశారట. చంద్రబాబు వచ్చిన తర్వాత 10 నిమిషాలకు గాని మిగిలిన మంత్రులు, అధికారులు నెమ్మదిగా సమావేశ మందిరానికి చేరుకున్నారట. అయితే అప్పటికే… అక్కడకు చంద్రబాబు వచ్చి కూర్చున్న ఫైనాన్ని చూసినంతనే… మంత్రులు, అధికారులు బిత్తరపోయారట. ఎందుకంటే… సమయ పాలన పాటించని వారిపై చంద్రబాబు ఏ రీతిన కోప్పడతారన్న విషయం తెలిసిన వారంతా హడలిపోయారట. వారిలోని భయాన్ని గుర్తించిన చంద్రబాబు… ఈ సారి అయినా కాస్తంత సమయ పాలన పాటించండి అంటూ సుతిమెత్తగానే మందలించారట.
This post was last modified on February 12, 2025 4:18 am
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…