Political News

జగన్ తెగింపుపై చంద్రబాబు కామెంట్స్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కల్తీ జరగలేదని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతూ వస్తున్నారు. కానీ, కల్తీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఆ ఇష్యూపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని గతంలో తాము చెప్పిన విషయం ఇప్పుడు సీబీఐ అరెస్టులతో తేటతెల్లమైందని చంద్రబాబు చెప్పారు. కల్తీ నెయ్యి గురించి తమ వ్యాఖ్యలను జగన్ తప్పుబట్టారని గుర్తు చేశారు. కానీ, లడ్డూ తయారీలో వాడే నెయ్యి సరఫరాకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారని, కొందరికి అనుకూలంగా నిబంధనలకు సడలించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అక్రమాలు బయటపడ్డ తర్వాత అయినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని, నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవని జగన్ సర్కార్ దుష్ప్రచారానికి ప్రయత్నించిందని ఆరోపించారు.

తాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని, జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డారు. బాబాయ్ హత్యను, కోడికత్తి డ్రామాను, గులకరాయి డ్రామాను కూడా టీడీపీపైకి నెట్టివేసేందుకు ప్రయత్నించారని, కాబట్టి జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అన్నారు.

కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలవుతోందని, కూటమిపై విశ్వాసంతో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో సవాళ్లు సహజమని, కానీ, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వనరులు అవే అని, అధికారులూ వాళ్లేనని, కానీ, కార్యదక్షత వల్లే అభివృద్ధిలో వ్యత్యాసం వస్తుందని చెప్పారు.

ఇక, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్ 1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడతామని హామీనిచ్చారు. ఆ చట్టం తొలగిస్తున్నామన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని గిరిజనులను కోరారు. అంతేకాదు, గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు.

This post was last modified on February 11, 2025 5:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

38 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago