వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని సోమరువారం ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఈ మేరకు రజిని తరఫు లాయర్లు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తనకు ముందస్తు బెయిల్ వస్తుందని రజిని ఆశాభావంతో ఉన్నట్టుగా సమాచారం.
సాధారణ కేసుల్లో అయితే… రాజకీయ నేతలు కాబట్టి.. వారి ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెడుతుంటారులే అన్న కోణంలో ఆలోచించే కోర్టులు ముందస్తు బెయిల్ లు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయ్యే కేసుల్లో అసలు బెయిల్ అన్నదే మంజుకు కాదు కదా. మరి విడదల రజినిపైన కూడా నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు కేసు కదా. ఈ లెక్కన రజినీకి హై కోర్టులో బెయిల్ రాదనే చెప్పాలి.
కూటమి సర్కారు పాలన మొదలు అయ్యాకా.. చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఒక్క బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ మినహా మిగిలిన వారంతా ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్ట్ ల నుంచి తప్పయించుకున్నారు. మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయినా ఆయన కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అయితే.. రజినీపై నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయిన కేసు కావడంతో ఆమెకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఆంటే… విడదల రజిని అరెస్ట్ కాక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 11, 2025 11:55 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…