వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని సోమరువారం ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఈ మేరకు రజిని తరఫు లాయర్లు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తనకు ముందస్తు బెయిల్ వస్తుందని రజిని ఆశాభావంతో ఉన్నట్టుగా సమాచారం.
సాధారణ కేసుల్లో అయితే… రాజకీయ నేతలు కాబట్టి.. వారి ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెడుతుంటారులే అన్న కోణంలో ఆలోచించే కోర్టులు ముందస్తు బెయిల్ లు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయ్యే కేసుల్లో అసలు బెయిల్ అన్నదే మంజుకు కాదు కదా. మరి విడదల రజినిపైన కూడా నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు కేసు కదా. ఈ లెక్కన రజినీకి హై కోర్టులో బెయిల్ రాదనే చెప్పాలి.
కూటమి సర్కారు పాలన మొదలు అయ్యాకా.. చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఒక్క బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ మినహా మిగిలిన వారంతా ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్ట్ ల నుంచి తప్పయించుకున్నారు. మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయినా ఆయన కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అయితే.. రజినీపై నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయిన కేసు కావడంతో ఆమెకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఆంటే… విడదల రజిని అరెస్ట్ కాక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 11, 2025 11:55 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…