వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని సోమరువారం ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఈ మేరకు రజిని తరఫు లాయర్లు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తనకు ముందస్తు బెయిల్ వస్తుందని రజిని ఆశాభావంతో ఉన్నట్టుగా సమాచారం.
సాధారణ కేసుల్లో అయితే… రాజకీయ నేతలు కాబట్టి.. వారి ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెడుతుంటారులే అన్న కోణంలో ఆలోచించే కోర్టులు ముందస్తు బెయిల్ లు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయ్యే కేసుల్లో అసలు బెయిల్ అన్నదే మంజుకు కాదు కదా. మరి విడదల రజినిపైన కూడా నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు కేసు కదా. ఈ లెక్కన రజినీకి హై కోర్టులో బెయిల్ రాదనే చెప్పాలి.
కూటమి సర్కారు పాలన మొదలు అయ్యాకా.. చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఒక్క బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ మినహా మిగిలిన వారంతా ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్ట్ ల నుంచి తప్పయించుకున్నారు. మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయినా ఆయన కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అయితే.. రజినీపై నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయిన కేసు కావడంతో ఆమెకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఆంటే… విడదల రజిని అరెస్ట్ కాక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
ప్రాంతీయ పార్టీల్లో చాలా మటుకు.. కుటుంబ సభ్యుల ప్రమేయం కొనసాగుతోంది. ఇది ఆయా పార్టీలకు కత్తిమీద సాముగా మారింది. తమిళనాడు,…
పెద్ది విడుదలైన వారం రోజులకే ఇంకో సినిమా రిలీజ్ చేసే సాహసం వేరే నిర్మాతలు చేయలేదు కానీ కంటెంట్ మీద…
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఎన్నో మెగా మూవీస్ తెరకెక్కుతున్నాయి. వాటన్నింట్లోకి వారణాసి రేంజ్ వేరు. ఆ సినిమా కోసం గ్లోబల్…
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…