Political News

సక్సెస్ మంత్రాన్ని లోకేష్ కనిపెట్టేసారు

ఏపీకి గతంలో కేంద్రం నుంచి పెద్దగా నిధులు గానీ, కనీసం కేటాయింపులు గానీ జరిగేవి కావు. కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఇదే పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా అదే పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాలకు భారీ ఎత్తున నిధులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వాలు…దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం అరకొర నిధులే ఇచ్చేవి. తెలుగు రాష్ట్రాల విషయంలో అయితే ఈ వివక్ష మరింతగా కనిపించేది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.

2025-2026 కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు జరిగాయి. అంతేకాకుండా బడ్జెట్ కంటే ముందు మరింతగా నిధులు కేంద్రం నుచి రాష్ట్రానికి వచ్చాయని చెప్పాలి. తాజా రైల్వే బడ్జెట్లో అయితే ఏకంగా ఉత్తరాది రాష్టాల కంటే కూడా ఏపీకి అధిక మొత్తం నిధులు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ ఏపీకి భారీగానే లబ్ది చేకూరిందని చెప్పాలి. గతంలో అరకొర నిధులు.. ఇప్పుడేమో అడగకున్నా భారీ మొత్తంలో నిధులు ఎలా సాధ్యం అన్న విషయంఫై అందరూ అయోమయానికి గురవుతున్నారు. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ మాత్రం ఇందులోని లోగుట్టును కనిపెట్టేసారు.

ఆ లోగుట్టును మంగళవారం నాటి తన ఢిల్లీ టూర్లో లోకేష్ బయటపెట్టారు కూడా. ఏపీలో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో మేజర్ ప్లేయర్గా టీడీపీ, ఆ తర్వాత స్థానాల్లో జనసేన, బీజేపీ ఉన్నాయి. అయినా కూడా ఈ మూడు పార్టీలకి చెందిన ఎంపీలు తమ పార్టీలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్నారు. రాష్ట్రానికి చెందిన ఏదైనా సమస్య ఉంటే… అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు. ఈ విషయాల్లో కేంద్ర మంత్రులను కలవాల్సి వచ్చినప్పుడు అందరూ కలిసే వెళుతున్నారు. ఫలితంగా ఏపీ సమస్యలు అప్పటికపుడే పరిష్కారం అయిపోతున్నాయి.

మంగళవారం నాటి ఢిల్లీ టూర్లో లోకేష్ ఇదే అంశాన్ని కూటమి పార్టీలకి చెందిన ఎంపీలకు చెప్పారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతున్న కారణంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని… బడ్జెట్లో కేటాయింపులు కూడా భారీగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఇదే వ్యూహాన్ని మున్ముందు కూడా కొనసాగిద్దామని ఆయన మూడు పార్టీల ఎంపీలకు సూచించారు. లోకేష్ ఢిల్లీ వచ్చిన సందర్భంగా 1 జనపథ్ లో మూడు పార్టీల ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్ చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని పాటించినంత కాలం ఏపీకి నిధుల కొరత ఉండదన్న మాట.

This post was last modified on February 9, 2025 4:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

23 minutes ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

4 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

5 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

8 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

8 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

9 hours ago