Political News

వర్మ వెంట వైసీపీ దండు కదిలింది!

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా… నాడు విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వర్మ వారిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ పోస్టులఫై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా… ఈ కేసులో విచారణకు వర్మ హాజరయ్యారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. పోలీసు విచారణకు వచ్చిన వర్మకు వైసీపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అంతేకాదండోయి… వర్మ వెంట ఏకంగా వైసీపీ దండు కదిలిపోయింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు లోని రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను పోలీసులు విచారించారు. ఈ సందర్బంగా ఒంగోలు లో వర్మకు వైసీపీ నేతలు ఓ రేంజిలో స్వాగతం పలికిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. అదేదో ప్రధాన మంత్రో… లేదంటే రాష్ట్రపతో వస్తే నేతలంతా క్యూ కట్టి మరి నిలబడి… వర్మకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు.

వర్మకు స్వాగత కార్యక్రమానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఒంగోలు పార్లమెంటు ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి నేతృత్వం వహించారు. ఇక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తదితరులు వర్మకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతల సంఖ్యకు అయితే లెక్కే లేదని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే… అన్నా రాంబాబు ఎవరో వర్మకు తెలియదన్నట్టు… రాంబాబును ముందుకు పిలిచిన చెవిరెడ్డి ఆయనను వర్మకు పరిచయం చేశారు. మొత్తంగా… పోలీసు విచారణకు వచ్చిన వర్మ… విచారణకు ఎలా సహకరించారో తెలియదు గానీ.,.. వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం నింపారు.

This post was last modified on February 8, 2025 2:39 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

14 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago