సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా… నాడు విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వర్మ వారిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ పోస్టులఫై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా… ఈ కేసులో విచారణకు వర్మ హాజరయ్యారు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. పోలీసు విచారణకు వచ్చిన వర్మకు వైసీపీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అంతేకాదండోయి… వర్మ వెంట ఏకంగా వైసీపీ దండు కదిలిపోయింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు లోని రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మను పోలీసులు విచారించారు. ఈ సందర్బంగా ఒంగోలు లో వర్మకు వైసీపీ నేతలు ఓ రేంజిలో స్వాగతం పలికిన తీరు అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. అదేదో ప్రధాన మంత్రో… లేదంటే రాష్ట్రపతో వస్తే నేతలంతా క్యూ కట్టి మరి నిలబడి… వర్మకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు.
వర్మకు స్వాగత కార్యక్రమానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఒంగోలు పార్లమెంటు ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి నేతృత్వం వహించారు. ఇక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తదితరులు వర్మకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతల సంఖ్యకు అయితే లెక్కే లేదని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే… అన్నా రాంబాబు ఎవరో వర్మకు తెలియదన్నట్టు… రాంబాబును ముందుకు పిలిచిన చెవిరెడ్డి ఆయనను వర్మకు పరిచయం చేశారు. మొత్తంగా… పోలీసు విచారణకు వచ్చిన వర్మ… విచారణకు ఎలా సహకరించారో తెలియదు గానీ.,.. వైసీపీ శ్రేణుల్లో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం నింపారు.
This post was last modified on February 8, 2025 2:39 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…