Political News

ఉత్కంఠ లేదు.. ఢిల్లీ ఓట‌ర్లు క్లారిటీ!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రెండు రోజుల కిందట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. 699 మంది అభ్య‌ర్తులు.. 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న ఢిల్లీ పోల్స్ కు సంబంధించి ఆది నుంచి పెద్ద ఎత్తున ప్ర‌చారం.. రాజ‌కీయం సాగాయి. ఎవ‌రికి వారు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఇంకేముంది.. ఓట‌రు నాడిని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని కూడా అనుకున్నారు. నిజానికి ఢిల్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా అలానే సాగింది.

తాజాగా శ‌నివారం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక‌.. ఎలాంటి ఉత్కంఠ లేదు.. ఎలాంటి ఉక్కిరి బిక్కిరీ లేదు. ఢిల్లీ ఓట‌ర్లు స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు. స్ప‌ష్ట‌మైన విధానంలోనే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. తొలుత శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో ఆది ఓటు నుంచే బీజేపీ ప‌ట్టుసాధించింది. ఉద్యోగులు.. రిటైర్డ్ ఉద్యోగులు.. స‌ర్వీసు ఉద్యోగులు.. ఇలా అన్ని విభాగాల‌కు చెందిన ఉద్యోగులు 70 శాతం మంది బీజేపీకి అనుకూలంగానే ఓటెత్తారు.

మొత్తం 70 అసెంబ్లీ నియోజ‌క‌వర్గాలు ఉన్న ఢిల్లీలో అధికారం చేప‌ట్టేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. తాజాగా వ‌స్తున్న ట్రెండ్ల‌లో బీజేపీ 45 స్థానాల‌కు మించి ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో 69 స్థానాలు కైవ‌సం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. కేవ‌లం 23-24 స్థానాల మ‌ధ్య ప‌రిమితం అయింది. అయితే.. ఈ ట్రెండు అటు ఇటు కొంత మారినా.. పెద్ద‌గా తేడా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప‌రిశీకులు అంచ‌నా వేస్తున్నారు.

ముఖ్యంగా మాస్ ఏరియాల్లో బీజేపీ పుంజుకుంది. ఇది ఖ‌చ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసింది. అంటే.. ఆప్ ఓట్లు గుండుగుత్త‌గా.. బీజేపీవైపు మ‌ళ్లాయి. అదేస‌మ‌యంలో మ‌ద్య త‌ర‌గతి ఉన్న చోట‌.. కూడా బీజేపీకి ఆశించిన విధంగానే ఓట్లు రాలుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ఆది నుంచి పెద్ద ఉత్కంఠ నెల‌కొంటుంద‌ని.. తీర్పు క‌ఠినంగా ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకున్నా.. అదేమీ లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. ఢిల్లీ ఓట‌రు ముందే డిసైడ్ అయిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన విష‌యం స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on February 8, 2025 11:51 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPDelhi

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago