Political News

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి తీసుకుంటుందో… లేదంటే అవగాహన లేక తీసుకుంటుందో తెలియట్లేదు. అయితే ఆ నిర్ణయాలు మాత్రం ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది. కొత్త జోన్ పరిధిపై కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే… ఏపీ ప్రభుత్వం నుంచి ఈ ఆందోళనను తెలుసుకున్నంతనే… కేంద్రం మార్పు చేర్పులు చేసి నూతన పరిధిని ప్రకటించింది.

ఈ మేరకు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాత్రి ఓ కీలక ప్రకటన చేసారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి నూతన పరిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ ప్రజలు కోరినట్టుగా వాల్తేర్ డివిజన్ ను కొత్త రైల్వే జోన్ లోనే కొనసాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టానికి లోబడి కొత్త రైల్వే జోన్ ను ఏర్పాటు చేశామని కూడా మంత్రి చెప్పారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్తగా రాయగడ పేరిట ఓ డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ డివిజన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. మరి ఈ జోన్ లో ఏపీ ప్రజలు అనుమానిస్తున్నట్లు అరకు స్టేషన్ దానిలో ఉందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. దీని గురించి మంత్రి ప్రస్తావించలేదు. ఏపీ పర్యాటకానికి మకుటాయమానంగా నిలిచిన అరకును రాయగడ డివిజన్ లో కలిపితే మాత్రం ఏపీ ప్రజల నుంచి మరోమారు కేంద్రానికి తలనొప్పి తప్పదని చెప్పాలి.

This post was last modified on February 8, 2025 12:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

2 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

6 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

7 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

8 hours ago

“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం…

8 hours ago

తొలి సీజన్‌కు 40 లక్షలు.. రెండో సీజన్‌కు 20 కోట్లు

సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…

9 hours ago