Political News

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి తీసుకుంటుందో… లేదంటే అవగాహన లేక తీసుకుంటుందో తెలియట్లేదు. అయితే ఆ నిర్ణయాలు మాత్రం ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది. కొత్త జోన్ పరిధిపై కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే… ఏపీ ప్రభుత్వం నుంచి ఈ ఆందోళనను తెలుసుకున్నంతనే… కేంద్రం మార్పు చేర్పులు చేసి నూతన పరిధిని ప్రకటించింది.

ఈ మేరకు రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాత్రి ఓ కీలక ప్రకటన చేసారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి నూతన పరిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ ప్రజలు కోరినట్టుగా వాల్తేర్ డివిజన్ ను కొత్త రైల్వే జోన్ లోనే కొనసాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్ గా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టానికి లోబడి కొత్త రైల్వే జోన్ ను ఏర్పాటు చేశామని కూడా మంత్రి చెప్పారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్తగా రాయగడ పేరిట ఓ డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ డివిజన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. మరి ఈ జోన్ లో ఏపీ ప్రజలు అనుమానిస్తున్నట్లు అరకు స్టేషన్ దానిలో ఉందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. దీని గురించి మంత్రి ప్రస్తావించలేదు. ఏపీ పర్యాటకానికి మకుటాయమానంగా నిలిచిన అరకును రాయగడ డివిజన్ లో కలిపితే మాత్రం ఏపీ ప్రజల నుంచి మరోమారు కేంద్రానికి తలనొప్పి తప్పదని చెప్పాలి.

This post was last modified on February 8, 2025 12:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

2 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

3 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

3 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

4 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

4 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

5 hours ago