తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లేశారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను కూడా కలిశారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణఫై స్పష్టత వచ్చింది.
ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ లేదన్న రేవంత్ రెడ్డి.. పీసీసీ పునర్వ్యవస్తీకరణ మాత్రం ఉంటుందని చెప్పారు. పీసీసీ షఫిలింగ్ త్వరలోనే ఉంటుందని… ఇప్పటికే దానికి సంబందించిన కసరత్తు పూర్తి అయ్యిందని కూడా రేవంత్ చెప్పారు. పీసీసీ పునర్వ్యవస్తీకరణ, కేబినెట్ పునర్వ్యవస్తీకరణ ఒకే సమయంలో ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుందన్న భావనతో కేబినెట్ పునర్వ్యవస్తీకరణను వాయిదా వేసినట్టు సమాచారం.
కేబినెట్ పునర్వ్యవస్తీకరణ వాయిదా పడటంతో ఆశావహులు నీరుగారిపోయినా.. కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని భావించిన వారు మాత్రం ఊపిరి పీల్చుకున్నారని చెప్పక తప్పదు. రేవంత్ కేబినెట్ ఏర్పడి అప్పుడే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో పలువురు మంత్రులపై లెక్కలేనన్ని వివాదాలు వచ్చాయి. కొండా సురేఖ అయితే… ఎప్పుడు కేబినెట్ పునర్వ్యవస్తీకరణ ఉన్నాఆమెపై వేటు ఖాయమన్న వాదనలు వినిపించాయి. అయితే… ఇప్పుడు కేబినెట్ విస్తరణ వాయిదా పడటంతో సురేఖతో పాటు… వేటు పడుతుందని భావిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…