రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కోసం ఏర్పాటు అయిన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో దేశంలో వద్దే రేట్లు తగ్గడానికి మార్గం సుగమం అయ్యింది. ఆర్బీఐ నూతన గవర్నర్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంజయ్ మల్హోత్రా తన తోలి చర్యతోనే వద్దే రేట్ల తగ్గింపు దిశగా కీలక అడుగు వేశారు. గడచిన ఐదేళ్లుగా ఏ ఒక్కరు ఈ దిశగా అడుగు ముందుకు వేయలేకపోయారు. ఆ సంప్రదాయానికి మల్హోత్రా తిలోదకాలిచ్చేశారు.
గురువారం ఆర్బీఐ త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష జరిగింది. ఆర్బీఐ గవర్నర్ గా మల్హోత్రా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ సమీక్షలో మల్హోత్రా డేరింగ్ స్టెప్ వేశారు. రేపో రేటును 0.25 శాతం తగ్గిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటిదాకా 6.50 గా ఉన్న రేపో రేటు… మల్హోత్రా నిర్ణయంతో 6.25కు దిగివచ్చింది. ఇలా దేశంలో రేపో రేటు తగ్గడం గడచిన ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఈ పరిణామం వడ్డీ రేట్లను భారీగా కాకపోయిన ఓ మోస్తరుగా తగ్గిస్తుందని చెప్పాలి. వినియోగదారులపై బ్యాంకులు వసులు చేస్తున్న వడ్డీ రేటులో హీనపక్షం 50 పైసలు తగ్గే అవకాశం ఉంది. దీనిని గృహ, వాహన రుణాలపై భారీ వెసులుబాటుగానే ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ రుణాలపైనా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి.
అయితే వడ్డీ రేట్లు పెరిగే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాంకులు చాలా వేగంగా వడ్డీ రేట్లను పెంచుతాయి. అదే సమయంలో వడ్డీ రేట్లను తగ్గించే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే మాత్రం బ్యాంకులు అంత త్వరగా వడ్డీ రేట్లను తగ్గించవు. ఇప్పుడు కూడా వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నా బ్యాంకులు ఆ దిశగా వేగంగా నిర్ణయం తీసుకుంటాయో… లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ రేట్లను పెంచడంలో చూపించే ఆసక్తిని బ్యాంకులు ఆ వడ్డీ రేట్లను తగ్గించడంలోనూ చూపించేలా ఆర్బీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 7, 2025 12:58 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…