ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కొత్త సేవలను ప్రారంభించారు. యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు… ప్రత్యేకించి విద్యార్థులు నుంచి వినిపించిన సమస్యల పరిష్కారం కోసమే ఆయన ఈసేవలను ప్రారంభించారు.
ఇటీవలే లోకేష్ చేతుల మీదుగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం అయిన సంగతి తెగెలిసిందే. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంభందించిన హాల్ టికెట్ లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం విడుదల చేసింది. అంటే… ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్ ల కోసం ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. ఎంచక్కా… తమ మొబైల్ ఫోన్ల ద్వారానే వారు తమ హాల్ టికెట్ లను పొందవచ్చు. వెరసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు శ్రమ తగ్గిపోయిందని చెప్పాలి.
ఏపీలో ఇంటర్ పరీక్షలు మర్చి 1 నుంచి మర్చి 20 వరకు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు…మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ లో ఇంటర్ హాల్ టికెట్ లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలన్న విషయానికి వస్తే.. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ల నుంచి కింది విధంగా హాల్ టికెట్ లను పొందవచ్చు.
1. ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్కి హాయ్ (Hi) అని వాట్సప్లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.
2. ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలపై క్లిక్ చేయాలి.
3. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
4. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే ఎంతో సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది.
This post was last modified on February 7, 2025 12:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…