Political News

ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం.. సీఎం రేవంత్ ప్లాన్‌

‘ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం’ నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు..ఇలా అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొనేలా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

తాజాగా జ‌రిగిన సీఎల్పీ స‌మావేశంలో ప‌లు విష‌యంపై చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానికి సంస్థల ఎన్నిక‌ల‌పైనా దృష్టి పెట్టారు. స్థానిక సంస్థ‌ల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసే దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించారు. దీనికిగాను ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుని పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను పార్టీవైపు మ‌ళ్లించుకోవాలని ఈ సంద‌ర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేష‌న్ వ‌ర్గీక‌ర‌ణల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ క్ర‌మంలో కొంత క‌ష్టమైనా.. గ‌డ‌ప గ‌డ‌ప తిరిగి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డితేనే.. ఫ‌లితం వ‌స్తుంద‌ని.. కేవ‌లం ఎవ‌రో ఒక‌రిద్ద‌రు క‌ష్ట‌ప‌డ‌త‌రులే.. మ‌నం కూర్చుంట‌మంటే.. ప్ర‌యోజ‌నం లేద‌ని సీఎం రేవంత్ ఈసంద‌ర్భంగా వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాల‌ని సూచించారు.

వేటు త‌ప్ప‌దు!

సీఎల్పీ భేటీలో పార్టీ క‌ట్టు తప్పుతున్న ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌పై వాడి వేడిగా చ‌ర్చ సాగింది. పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా ఇరుకున పెడుతున్న ఇలాంటి వారిని ఉపేక్షించ‌రాద‌ని.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్‌కు స‌భ్యులు సూచించారు. అయితే.. ఆ విష‌యాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని.. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రేవంత్ వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.

This post was last modified on February 6, 2025 6:38 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

34 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

45 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

1 hour ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago