Political News

‘తాడేప‌ల్లి ప్యాల‌స్‌’కు నిప్పు.. అనేక సందేహాలు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం క‌మ్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని ప్యాల‌స్‌కు గుర్తు తెలియ‌ని దుండ‌గులు నిప్పు పెట్టారు. ఈ వ్య‌వ‌హారం.. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. అటువైపు ఎవ‌రినీ రాకుండా.. జ‌గ‌న్ భ‌ద్ర‌తా సిబ్బంది క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో విష‌యం ఆల‌స్యంగా వెలుగు చూసింది. భారీ ఎత్తున రాజుకున్న మంట‌ల‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆర్పేసే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఈ నిప్పు వెనుక కొన్ని నిజాలు దాచేప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ.. టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ లు గుప్పించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం.. జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం(లిక్క‌ర్ స్కామ్‌)పై విచార‌ణ‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేస్తూ.. బుధ‌వారం రాత్రి ఉత్త‌ర్వులు ఇచ్చింది. విజ‌యవాడ పోలీసు క‌మిష‌న‌ర్ రాజ‌శేఖ‌ర‌బాబు దీనిని నేతృత్వం వ‌హిస్తున్నారు. ఈ కేసులో ఎంత‌టి వారు ఉన్నా.. వ‌ద‌ల‌ద్ద‌ని.. ఎవ‌రినైనా ప్ర‌శ్నించాల‌ని.. పేర్కొంటూ.. ప్ర‌భుత్వం విశేష అధికారాలు ఈ సిట్‌కు క‌ట్ట‌బెట్టింది.

అంతేకాదు.. ఎంత‌వారినైనా అరెస్టు చేసే అధికారం కూడా క‌ల్పించింది. ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కూడా అవ‌కాశం క‌ల్పించింది. ఈ ప‌రిణామం జ‌రిగిన కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే తాడేప‌ల్లి ప్యాల‌స్ వ‌ద్ద అగ్గి రాజుకోవ‌డం.. దీనిలో కొన్ని ఫైళ్లు, డైరీలు కూడా త‌గ‌ల‌బ‌డ‌డం వంటివి అనేక సందేహాల‌కు తావిస్తున్నాయ‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. “ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?” అంటూ.. టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అంతేకాదు.. ఉద‌యం ఎప్పుడో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబ‌ధించి.. ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని కూడా నిల‌దీశారు. “కీల‌క ఫైళ్ల‌ను తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.0నా?” అని ప్ర‌శ్నిస్తున్నారు. “ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ” అంటూ టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

20 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

47 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago