వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని సాయిరెడ్డి చెప్పారు. అంతేకాదు, రాజకీయ సన్యాసం తర్వాత ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతా అని చెప్పడమే కాకుండా..ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయిరెడ్డి. అయితే, సాయిరెడ్డి రాజీనామాపై ఇప్పటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించలేదు. తాజాగా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకరికి భయపడో..కేసులు పెడతారన్న బెదిరింపులకు తలొగ్గో..ఇంకో కారణం చేతనో పార్టీ వీడే వారికి గౌరవం, క్యారెక్టర్, వాల్యూ ఏముంటాయని జగన్ ప్రశ్నించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, అధికారం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని, ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుందని చెప్పారు. సాయిరెడ్డికైనా, పార్టీని వీడి బయటకు వెళ్లిన ముగ్గురికైనా అదే వర్తిస్తుందని జగన్ అన్నారు.
పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నానని, కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకునేలా మనం ఉండాలని అన్నారు. తన గురించైనా…తమ ఎమ్మెల్యే, ఎంపీల గురించి కేడర్ అలాగే చెప్పుకోవాలని తెలిపారు.
అయితే, పార్టీ వీడొద్దని జగన్ చెప్పినా వినకుండా సాయిరెడ్డి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా హడావిడిగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జగన్ కు నచ్చలేదట. ఈ క్రమంలోనే తాజాగా సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఈ విధంగా స్పందించారని తెలుస్తోంది. అయితే, గతంలో కూడా పార్టీని కొందరు నాయకులు వీడగా…జగన్ ఇదే తరహా కామెంట్లు చేశారు. పోయేవారిని ఆపబోనని అన్నారు. నాయకుల వల్ల వైసీపీ నిలబడలేదని, దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతుతోనే నిలబడిందని జగన్ చెప్పారు.
This post was last modified on February 6, 2025 3:37 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…