వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని సాయిరెడ్డి చెప్పారు. అంతేకాదు, రాజకీయ సన్యాసం తర్వాత ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతా అని చెప్పడమే కాకుండా..ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయిరెడ్డి. అయితే, సాయిరెడ్డి రాజీనామాపై ఇప్పటి వరకు ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించలేదు. తాజాగా నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకరికి భయపడో..కేసులు పెడతారన్న బెదిరింపులకు తలొగ్గో..ఇంకో కారణం చేతనో పార్టీ వీడే వారికి గౌరవం, క్యారెక్టర్, వాల్యూ ఏముంటాయని జగన్ ప్రశ్నించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, అధికారం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని, ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుందని చెప్పారు. సాయిరెడ్డికైనా, పార్టీని వీడి బయటకు వెళ్లిన ముగ్గురికైనా అదే వర్తిస్తుందని జగన్ అన్నారు.
పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నానని, కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకునేలా మనం ఉండాలని అన్నారు. తన గురించైనా…తమ ఎమ్మెల్యే, ఎంపీల గురించి కేడర్ అలాగే చెప్పుకోవాలని తెలిపారు.
అయితే, పార్టీ వీడొద్దని జగన్ చెప్పినా వినకుండా సాయిరెడ్డి రాజీనామా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా హడావిడిగా సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జగన్ కు నచ్చలేదట. ఈ క్రమంలోనే తాజాగా సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఈ విధంగా స్పందించారని తెలుస్తోంది. అయితే, గతంలో కూడా పార్టీని కొందరు నాయకులు వీడగా…జగన్ ఇదే తరహా కామెంట్లు చేశారు. పోయేవారిని ఆపబోనని అన్నారు. నాయకుల వల్ల వైసీపీ నిలబడలేదని, దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతుతోనే నిలబడిందని జగన్ చెప్పారు.
This post was last modified on February 6, 2025 3:37 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…