ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఆప్ అనుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం అంచనాలకు మించింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ పూర్తయ్యే సరికి ఆ శాతం దాదాపు 61కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
2020 ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్ అధికరంగా జరిగే చాన్స్ ఉంది. అయితే, ఆ పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, ఆప్ ల మధ్య గట్టిపోరు తప్పదని దాదాపుగా మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అఖండ విజయాన్ని పక్కాగా అంచనా వేసిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆప్ గెలుపును తేల్చేశాయి. ఈ ఎన్నికల్లో ఆప్ 39, బీజేపీ 22 సీట్లు దక్కించుకుంటాయని కేకే సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఈ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఆప్ నేతలు తమ గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అయితే, చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీజేపీ 51-60 సీట్లతో అధికారం చేపడుతుందని తేల్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు:
పీపుల్స్ పల్స్: బీజేపీ 51-60, ఆప్ 10-19
ఏబీపీ మ్యాట్రిజ్: బీజేపీ 35-40, ఆప్ 32-37
ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్ 27-30, కాంగ్రెస్ 1-3
చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ 39-44, ఆప్ 25-28
ఢిల్లీ టౌమ్స్ నౌ: బీజేపీ 39-45, ఆప్ 22-31
This post was last modified on February 6, 2025 7:41 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…