Political News

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగైనా అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఆప్ అనుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం అంచనాలకు మించింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ పూర్తయ్యే సరికి ఆ శాతం దాదాపు 61కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

2020 ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్‌ అధికరంగా జరిగే చాన్స్ ఉంది. అయితే, ఆ పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, ఆప్ ల మధ్య గట్టిపోరు తప్పదని దాదాపుగా మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అఖండ విజయాన్ని పక్కాగా అంచనా వేసిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆప్ గెలుపును తేల్చేశాయి. ఈ ఎన్నికల్లో ఆప్‌ 39, బీజేపీ 22 సీట్లు దక్కించుకుంటాయని కేకే సర్వే వెల్లడించింది. గత ఎన్నికల్లో ఈ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఆప్ నేతలు తమ గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అయితే, చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీజేపీ 51-60 సీట్లతో అధికారం చేపడుతుందని తేల్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు:

పీపుల్స్‌ పల్స్‌: బీజేపీ 51-60, ఆప్‌ 10-19

ఏబీపీ మ్యాట్రిజ్‌: బీజేపీ 35-40, ఆప్‌ 32-37

ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్‌ 27-30, కాంగ్రెస్‌ 1-3

చాణక్య స్ట్రాటజీస్‌: బీజేపీ 39-44, ఆప్‌ 25-28

ఢిల్లీ టౌమ్స్‌ నౌ: బీజేపీ 39-45, ఆప్‌ 22-31

This post was last modified on February 6, 2025 7:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 minutes ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago