Political News

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాబోయే 30 ఏళ్లు వైసీపీదే అధికారం అని, ఇకపై, జగన్ 2.0 చూస్తారని జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో, జగన్ డైలాగులకు లేటెస్ట్ ట్రెండింగ్ బీజీఎంలు ఇచ్చి భారీ ఎలివేషన్లతో వీడియోలను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అయితే, వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ జగన్ గాలి తీసేలా మంత్రి లోకేశ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. 2024 ఎన్నికల ముందు కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడని..కానీ, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసని లోకేశ్ సెటైర్లు వేశారు.

అంతేకాదు, ప్రజలు ఇంకా జగన్ 1.0 అరాచకం నుంచే కోలుకులేదని, అప్పుడే జగన్ 2.0 అని అంటున్నారని జగన్ కు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసుల గురించి జగన్ మాట్లాడుతున్నారని, కానీ, ఆయన హయాంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించారని, కొందరిని చంపారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని…ఇక్కడున్న టీడీపీ నేతలందరిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాను బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టారని, తనపై 23 కేసులు పెట్టారని అన్నారు. అందులో, హత్యాయత్నం కేసు ..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని.

శాశ్వత భూ హక్కు అంటూ ప్రజల భూములు కాజేసే ప్రయత్నం చేసశారని, ప్రజలు అవేమీ మరిచిపోలేదని చెప్పారు. ఇక, చట్టప్రకారం గత ప్రభుత్వం చేసిన స్కామ్ లపై చర్యలు తీసుకుంటామని, అది కక్ష సాధింపు కాదని అన్నారు. ఇక, జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తామేమీ చేయలేమని చురకలంటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం జగన్ బాధ్యత అని, కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని అన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on February 6, 2025 7:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

1 hour ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

13 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

13 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

14 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

14 hours ago