Political News

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాబోయే 30 ఏళ్లు వైసీపీదే అధికారం అని, ఇకపై, జగన్ 2.0 చూస్తారని జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో, జగన్ డైలాగులకు లేటెస్ట్ ట్రెండింగ్ బీజీఎంలు ఇచ్చి భారీ ఎలివేషన్లతో వీడియోలను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అయితే, వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ జగన్ గాలి తీసేలా మంత్రి లోకేశ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. 2024 ఎన్నికల ముందు కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడని..కానీ, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసని లోకేశ్ సెటైర్లు వేశారు.

అంతేకాదు, ప్రజలు ఇంకా జగన్ 1.0 అరాచకం నుంచే కోలుకులేదని, అప్పుడే జగన్ 2.0 అని అంటున్నారని జగన్ కు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసుల గురించి జగన్ మాట్లాడుతున్నారని, కానీ, ఆయన హయాంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించారని, కొందరిని చంపారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని…ఇక్కడున్న టీడీపీ నేతలందరిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాను బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టారని, తనపై 23 కేసులు పెట్టారని అన్నారు. అందులో, హత్యాయత్నం కేసు ..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని.

శాశ్వత భూ హక్కు అంటూ ప్రజల భూములు కాజేసే ప్రయత్నం చేసశారని, ప్రజలు అవేమీ మరిచిపోలేదని చెప్పారు. ఇక, చట్టప్రకారం గత ప్రభుత్వం చేసిన స్కామ్ లపై చర్యలు తీసుకుంటామని, అది కక్ష సాధింపు కాదని అన్నారు. ఇక, జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తామేమీ చేయలేమని చురకలంటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం జగన్ బాధ్యత అని, కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని అన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on February 6, 2025 7:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

22 minutes ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

4 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

5 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

8 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

8 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

9 hours ago