Political News

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాబోయే 30 ఏళ్లు వైసీపీదే అధికారం అని, ఇకపై, జగన్ 2.0 చూస్తారని జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో, జగన్ డైలాగులకు లేటెస్ట్ ట్రెండింగ్ బీజీఎంలు ఇచ్చి భారీ ఎలివేషన్లతో వీడియోలను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. అయితే, వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ జగన్ గాలి తీసేలా మంత్రి లోకేశ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. 2024 ఎన్నికల ముందు కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడని..కానీ, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసని లోకేశ్ సెటైర్లు వేశారు.

అంతేకాదు, ప్రజలు ఇంకా జగన్ 1.0 అరాచకం నుంచే కోలుకులేదని, అప్పుడే జగన్ 2.0 అని అంటున్నారని జగన్ కు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసుల గురించి జగన్ మాట్లాడుతున్నారని, కానీ, ఆయన హయాంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలపై అక్రమ కేసులు బనాయించారని, కొందరిని చంపారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదని…ఇక్కడున్న టీడీపీ నేతలందరిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాను బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టారని, తనపై 23 కేసులు పెట్టారని అన్నారు. అందులో, హత్యాయత్నం కేసు ..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని.

శాశ్వత భూ హక్కు అంటూ ప్రజల భూములు కాజేసే ప్రయత్నం చేసశారని, ప్రజలు అవేమీ మరిచిపోలేదని చెప్పారు. ఇక, చట్టప్రకారం గత ప్రభుత్వం చేసిన స్కామ్ లపై చర్యలు తీసుకుంటామని, అది కక్ష సాధింపు కాదని అన్నారు. ఇక, జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తామేమీ చేయలేమని చురకలంటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం జగన్ బాధ్యత అని, కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడాలని అన్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on February 6, 2025 7:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

31 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago