Political News

‘స్థానికం’లో జ‌న‌సేన త‌ప్పుకొంది.. రీజ‌నేంటి ..!

స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి చైర్ ప‌ర్స‌న్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వుల‌కు సంబంధించిన పోటీ తీవ్ర‌స్థాయిలో జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 ప‌దవుల‌కు.. ఒక డిప్యూటీ మేయ‌ర్‌(తిరుపతి) ప‌ద‌వికి ఎన్నికలు జ‌రిగాయి. ఈ ఎన్నికల్లో కూట‌మిని ముందుకు న‌డిపిస్తున్న టీడీపీ ఆయా ప‌ద‌వుల‌ను కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన ఎక్క‌డా పోటీ కూడా ఇవ్వ‌లేదు. దీంతో జ‌న‌సేన స్థానిక పోటీలో త‌ప్పుకొందా? లేక‌.. మ‌రేదైనా జ‌రిగిందా? అనే చర్చ జ‌రుగుతోంది.

స్థానికంలో జ‌రిగిన ప‌ద‌వుల వేట‌లో టీడీపీ నేత‌లు ముందున్నారు. పైగా.. ఇప్పుడు తిరిగి ఘ‌ర్ వాప‌సీ వ‌చ్చిన వారు కూడా కొంద‌రు ఉన్నారు. దీంతో టీడీపీ వైపు మొగ్గు ఎక్కువ‌గా క‌నిపించింది. ఇక‌, జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. క్షేత్ర‌స్థాయిలో పుంజుకున్నాక‌.. ఇలాంటి ప‌ద‌వులు తీసుకుంటే బెట‌ర్ అన్న ఆలోచ‌న తోనే స్థానిక పోరు నుంచి త‌ప్పుకొన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు మౌనంగా ఉండిపోయారు.

తిరుప‌తి నుంచి నందిగామ వ‌ర‌కు.. కీల‌క‌మైన స్థానాల్లో వివాదాలు చోటు చేసుకున్నా ఎక్క‌డా జ‌న‌సేన పేరు వినిపించ‌లేదు. ఆ పార్టీ నాయ‌కులు కూడా క‌నిపించ‌లేదు. ఇక‌, మ‌రో ప‌క్షం బీజేపీ కూడా ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా మౌనంగానే ఉన్నారు. దీంతో టీడీపీ త‌ర‌ఫున కొంత హ‌డావుడి క‌నిపించింది. దీంతోనే ఎక్క‌డా ఎలాంటి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు లేకుండానే టీడీపీ నేత‌లు ప‌గ్గాలు చేప‌ట్టారు.

ఇదిలావుంటే.. ఆది నుంచి కూడా స్థానికంపై పెద్ద‌గా జ‌న‌సేన దృష్టి పెట్ట‌లేదు. పైగా ఎవ‌రూ కూడా ఆశ ప‌డిన‌ట్టు వార్త‌లు రాలేదు. కానీ, అంత‌ర్గ‌తంగా చ‌ర్చ అయితే జ‌రిగింది. దీనికి పార్టీ అధినేత నుంచి స‌రైన సుముఖ‌త రాక‌పోగా.. నాయకులు ఈ విష‌యంలో మౌనంగా ఉండాల‌ని సూచించారు. ఫ‌లితంగా.. జ‌న‌సేన ఎక్క‌డా స్థానికంగా పోటీకి కానీ.. వివాదాల‌కు కానీ.. ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది టీడీపీకి అంత‌ర్గ‌తంగా క‌లిసి వ‌చ్చిన ప‌రిణామం.

This post was last modified on February 5, 2025 2:11 pm

Share
Show comments
Published by
Satya
Tags: JanasenaTDP

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago