Political News

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన ఉన్న గోడలపై హిందూ దేవతల బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు..చివరగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ దిగజార్చిందని ఆరోపణలు వచ్చాయి.

అయితే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వెంకన్న ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఎన్నో సంస్కరణలు, చర్యలు చేపట్టింది. టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న కొందరు అన్యమత ప్రచారం చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 18 మంది ఉద్యోగులను బదిలీ చేసింది. అన్యమత ఉద్యోగస్తులు కొందరు అన్యమత ప్రచారం చేస్తున్నారని, మరికొందరు ఉద్యోగుల అండ చూసుకొని తిరుమల కొండపై మాంసాహారం, గంజాయి, మందు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఆ క్రమంలోనే విచారణ జరిపిన టీటీడీ అన్యమత ప్రచారం చేస్తున్న 69 మందిని గుర్తించింది. అందులో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ 69 మందిలో 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు తాజాగా టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్యా సంస్థల్లో లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్లు తదితరులు ఉన్నారు. మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో టీటీడీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

టీటీడీలో, తిరుమలలో పలు చోట్ల పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను వేరే స్థానాలకు బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 18 మంది బదిలీతో తొలి అడుగు పడినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో అన్యమతుస్తులైన ఉద్యోగులందరినీ బదిలీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం, టీటీడీ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on February 5, 2025 12:59 pm

Share
Show comments
Published by
Satya
Tags: TTD

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

3 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

3 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

7 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

7 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

9 hours ago