ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి? అనే అంశాలపై సీఎం చంద్రబాబు తాజాగా ఉన్నతాధికారుల తో సమీక్షించారు. ప్రజల సంతృప్తి వ్యవహారంపై ఆయన ఆరా తీశారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, దావోస్ సదస్సు, పింఛన్ల పంపిణీ, ఉచిత గ్యాస్, రహదారుల నిర్మాణం, ధాన్యం సేకరణ, నిధుల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల సంతృప్తిని తెలుసుకున్న చంద్రబాబు.. మరింతగా సంతృప్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పథకాల అమలు విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని చంద్రబాబు తెలిపారు. ప్రజల సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని ఆధారంగా మార్పులు చేసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ పనితీరు వంటివాటిపై ప్రజల నుంచి 80-90 శాతం మధ్య సంతృప్తి వ్యక్తమైంది. ఇక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై మిశ్రమ సంతృప్తి వ్యక్తమైంది. ధాన్యం కొనుగోలు, నిధుల పంపిణీపై రైతులు సంతోషంగానే ఉన్నారు. ఆయా విషయాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
అయితే.. సంతృప్తి సమపాళ్లలో లేదని.. చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం ఏశారు. ప్రజల నుంచి ఐవిఆ ర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో చేపట్టిన సర్వేలలో ఖచ్చితమైన రిజల్ట్ వచ్చిందని.. వారి అసంతృప్తికి కారణంపై దృష్టి పెట్టాలని కూడా చంద్రబాబు సూచించారు. మరింత మెరుగ్గా పనితీరు ఉండాలని.. ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని తెలిపారు.
“ఒకే ఒక వ్యక్తి పింఛను ఇంటికి వచ్చి ఇవ్వడం లేదని చెప్పినా.. దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, లంచాలు అడిగినా కఠినంగా వ్యవహరించాలి. ప్రజలు సంతృప్తిగా ఉన్నా రని మీరు చెబుతున్నా.. సేవలను పరిశీలిస్తే.. ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమీక్ష సాగడం గమనార్హం.
This post was last modified on February 4, 2025 9:19 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…