Political News

ఢిల్లీలో నారా లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆయన 4 గంటల వరకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీతో పాటు ఏపీకి చెందిన బీజేపీ, జనసేన ఎంపీలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి లోకేశ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. వైష్ణవ్ తో భేటీ కోసమే లోకేశ్ ఢిల్లీ టూర్ కి వెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగా పేరు గడించిన ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో లోకేశ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ లో భాగంగా ఏపీ సీఎం అధికారిక నివాసం అయిన 1 జన్ పథ్ లోనే లోకేశ్ బస చేశారు. ఈ క్రమంలో 1 జన్ పథ్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్… లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తీరు చూస్తుంటే… ఈ మీటింగ్ ప్రీ ప్లాన్ మీటింగేనని అర్థం అవుతోంది. లోకేశ్ టీం నుంచి సమాచారం అందుకున్న ప్రశాంత్ కిశోర్ నేరుగా 1 జన్ పథ్ కు వచ్చి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జనమంతా వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నా… ప్రశాంత్ కిశోర్ మాత్రం జగన్ కు ఈ దఫా ఓటమి తప్పదని తనదైన శైలి విశ్లేషణలు వెల్లడించారు. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. ఐప్యాక్ ను ప్రశాంత్ కిశోరే స్థాపించినా.. ప్రస్తుతం దానికి ఆయన దూరంగా ఉన్నారు. పీకే శిష్యుడు రాబిన్ శర్మ దానిని నడిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి కూడా రాబిన్ శర్మ టీడీపీకి సేవలు అందించారు. ఈ క్రమంలో తాజాగా లోకేశ్ తో పీకే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on February 4, 2025 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

22 minutes ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

4 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

5 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

8 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

8 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

9 hours ago