Political News

ఢిల్లీలో నారా లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆయన 4 గంటల వరకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీతో పాటు ఏపీకి చెందిన బీజేపీ, జనసేన ఎంపీలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి లోకేశ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. వైష్ణవ్ తో భేటీ కోసమే లోకేశ్ ఢిల్లీ టూర్ కి వెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగా పేరు గడించిన ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో లోకేశ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ లో భాగంగా ఏపీ సీఎం అధికారిక నివాసం అయిన 1 జన్ పథ్ లోనే లోకేశ్ బస చేశారు. ఈ క్రమంలో 1 జన్ పథ్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్… లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తీరు చూస్తుంటే… ఈ మీటింగ్ ప్రీ ప్లాన్ మీటింగేనని అర్థం అవుతోంది. లోకేశ్ టీం నుంచి సమాచారం అందుకున్న ప్రశాంత్ కిశోర్ నేరుగా 1 జన్ పథ్ కు వచ్చి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జనమంతా వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నా… ప్రశాంత్ కిశోర్ మాత్రం జగన్ కు ఈ దఫా ఓటమి తప్పదని తనదైన శైలి విశ్లేషణలు వెల్లడించారు. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. ఐప్యాక్ ను ప్రశాంత్ కిశోరే స్థాపించినా.. ప్రస్తుతం దానికి ఆయన దూరంగా ఉన్నారు. పీకే శిష్యుడు రాబిన్ శర్మ దానిని నడిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి కూడా రాబిన్ శర్మ టీడీపీకి సేవలు అందించారు. ఈ క్రమంలో తాజాగా లోకేశ్ తో పీకే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on February 4, 2025 8:58 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

12 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

14 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago