Political News

ఢిల్లీలో నారా లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆయన 4 గంటల వరకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీతో పాటు ఏపీకి చెందిన బీజేపీ, జనసేన ఎంపీలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి లోకేశ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. వైష్ణవ్ తో భేటీ కోసమే లోకేశ్ ఢిల్లీ టూర్ కి వెళ్లినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే… రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగా పేరు గడించిన ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో లోకేశ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ లో భాగంగా ఏపీ సీఎం అధికారిక నివాసం అయిన 1 జన్ పథ్ లోనే లోకేశ్ బస చేశారు. ఈ క్రమంలో 1 జన్ పథ్ కు వచ్చిన ప్రశాంత్ కిశోర్… లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన తీరు చూస్తుంటే… ఈ మీటింగ్ ప్రీ ప్లాన్ మీటింగేనని అర్థం అవుతోంది. లోకేశ్ టీం నుంచి సమాచారం అందుకున్న ప్రశాంత్ కిశోర్ నేరుగా 1 జన్ పథ్ కు వచ్చి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జనమంతా వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నా… ప్రశాంత్ కిశోర్ మాత్రం జగన్ కు ఈ దఫా ఓటమి తప్పదని తనదైన శైలి విశ్లేషణలు వెల్లడించారు. ఈ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. ఐప్యాక్ ను ప్రశాంత్ కిశోరే స్థాపించినా.. ప్రస్తుతం దానికి ఆయన దూరంగా ఉన్నారు. పీకే శిష్యుడు రాబిన్ శర్మ దానిని నడిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి కూడా రాబిన్ శర్మ టీడీపీకి సేవలు అందించారు. ఈ క్రమంలో తాజాగా లోకేశ్ తో పీకే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on February 4, 2025 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago