అధికార పక్షం ముందు ప్రతిపక్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్రమైనా.. రాష్ట్రమైనా.. ఒక్కటే రాజకీయం. మంచి చేసినా.. చెడు చేసినా.. అధికార పక్షంపై ప్రతిపక్షం సహజంగానే నిప్పులు చెరుగుతుంది. ఒకవేళ తమ తప్పే ఉన్నా.. ప్రతిపక్షాలు అంగీకరించ వు.పైగా ఎదురుదాడి చేస్తాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయమే జరుగుతోంది. అంతెందుకు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజకీయాలు సహజం. అసలు ప్రతిపక్షం ఉన్నదే సర్కారు తప్పులు ఎత్తి చూపేందుకు తప్ప.. తమ తప్పులు ఎంచేందుకు కాదు! అయితే.. తాజాగా రాహుల్ గాంధీ.. తనకు ప్రథమ ప్రత్యర్థి అయిన మోడీ ముందు.. ‘ఔను మేం తప్పు చేశాం’ అని ఒప్పుకొన్నారు.
ఇది చిత్రం కాదు. నిజమే. లోక్సభలో సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ.. నిరుద్యోగ సమస్యపై స్పందించారు. దేశంలో నిరుద్యోగం మర్రిచెట్టు ఊడల్లా దిగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అడ్డుకట్ట పడడం లేదన్నారు. ఇదేసమయంలో గత కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వం రెండు టెర్మ్ల్లోనూ.. కూడా నిరుద్యోగంపై సరైన విధంగా తాము దృష్టి పెట్టలేక పోయామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. దీని వల్ల నిరుద్యోగం మరింత పెరిగిందన్నారు. “ఔను. ఈ విషయాన్ని చెప్పేందుకు నేను బాధ పడడం లేదు. గత యూపీఏ హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక పోయాం” అని రాహుల్ అన్నారు.
ఈ సమయంలో ప్రధాన మంత్రి మోడీ.. సభలోనే ఉన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ముసిముసిగా నవ్వుకున్నారు. అయితే.. అనంతరం రాహుల్.. ప్రస్తుత మోడీ సర్కారు కూడా నిరుద్యోగాన్ని పరిష్కరించలేక పోతోందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రధాని చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం బాగుందన్న రాహుల్.. ప్రధాని ఈ కార్యక్రమం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ విషయంలో తాను ప్రధానిని తప్పుబట్టడం లేదన్నారు. కానీ, మేకిన్ ఇండియా మాత్రం విఫలమైందన్నారు. మొత్తానికి తాజాగా పార్లమెంటులో రాహుల్ చేసిన ప్రసంగం ఆసాంతం.. కొంత సుతిమెత్తగా సాగిందనే చెప్పాలి. కారణాలు ఏవైనా.. రాహుల్ మెత్తబడ్డారన్న విషయంపై కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on February 4, 2025 9:59 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…