టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య…రాజకీయాల్లో ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. తనను వరుసబెట్టి గెలిపిస్తూ వస్తున్న హిందూపురం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా బాలయ్య సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో హిందూపురం మునిసాలిటీపైనా టీడీపీ జెండాను ఎగురవేసి బాలయ్య తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
వాస్తవానికి హిందూపురం మునిసిపాలిటీకి వైసీపీ హయాంలో ఎన్నికలు జరగ్గా… అధికార పార్టీ దౌర్జన్యకాండ నేపథ్యంలో బాలయ్య ఉన్నా హిందూపురం మునిసిపాలిటీని వైసీపీనే దక్కించుకుంది.అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. అప్పటిదాకా హిందూపురం మునిసిపల్ చైర్మన్ గా సాగిన నేత ఆ పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే చాలా మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఖాళీగా ఉన్న మునిసిపల్ చైర్మన్ ఎన్నిను సోమవారం నిర్వహించగా… టీడీపీ ప్రతిపాదించిన రమేశ్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.
హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో గత వారం రోజులుగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకకొన్నాయి. తనకు దక్కిన మునిసిపాలిటీని నిలబెట్టుకునేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేయగా…తమవైపు తిరిగి వచ్చిన కౌన్సిలర్ల బలంతో హిందూపురం మునిసిపాలిటిపై టీడీపీ జెండా పాతేందుకు బాలయ్య తనదైన శైలి వ్యూహాలు అమలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి.
పెనుకొండ రిసార్టులో టీడీపీ కౌన్సిలర్లను పెట్టిన బాలయ్య… వారందరిని సోమవారం నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తరలించారు. అదే సమయంలో వైసీపీ కౌన్సిలర్లు మరో మార్గంలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం అధికారులు చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించగా… టీడీపీ ప్రతిపాదించిన రమేశ్ కు 23 ఓట్లు రాగా… వేసీపీ ప్రతిపాదించిన మహిళకు 14 ఓట్లే వచ్చాయి. దీంతో హిందూపురం మునిసిపాలిటీ టీడీపీ వశమైంది. ఈ ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో బాలయ్య స్వయంగా ఎన్నికలో పాలుపంచుకోవడమే కాకుండా గెలిచిన రమేశ్ ను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు.
This post was last modified on February 3, 2025 11:39 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…