కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో తనదైన మార్కుతో సాగుతున్న ముద్రగడ.. ఇప్పుడు దాదాపుగా రాజకీయాల్లో చివరి దశలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ.. తన పేరు చివరన రెడ్డి అనే ట్యాగ్ తగిలించుకున్న ముద్రగడ… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచే యత్నం చేస్తున్నారు. అయితే ఆ యత్నాలు అంతగా ఫలించడం లేదు.
ఇలాంటి క్రమంలో ఉన్నట్టుండి…ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన కిర్లంపూడిలో పెను కలకలమే రేపింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ట్రాక్టర్ తో దూసుకువచ్చిన ఓ యువకుడు… అక్కడ ముద్రగడ ఇంటి ర్యాంపుపై నిలిచి ఉన్న కారును తన ట్రాక్టర్ తో బలంగానే ఢీకొట్టాడు. ఈ సందర్భంగా ఆ యువకుడి నోట నుంచి జై జనసేన అంటూ ఓ నినాదం వినిపించిందట. దీంతో ఈ దాడి జనసేన మద్దతుతోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన గురించి తెలిసినంతనే… కాపు నేతలు.. ప్రత్యేకించి ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. దాడి జరిగిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కూడా హుటాహుటీన అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే సమయం పెరుగుతున్న కొద్దీ అక్కడకు చేరుకుంటున్న ముద్రగడ అభిమానుల సంఖ్య పెరుగుతుండటం టెన్షన్ వాతావరణాన్ని మరింతగా పెంచేసింది.
This post was last modified on February 2, 2025 12:41 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…