రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ చోటే లేదు. దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో సువిశాల విస్తీర్ణంలో వందలాది గదులతో రాజ ప్రసాదాన్ని తలపించేలా నిర్మితమైన ఈ భవన్ ను ఒక్కసారి అయినా దర్శించి తీరాలని కోరుకోని భారతీయుడు ఉండరు. అలాంటి రాష్ట్రపతి భవన్ లో ఇప్పుడు ఓ పెళ్లి వేడుక జరగనుంది. ఈ వేడుకకు స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు.
ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకలో ముర్ముకు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేస్తున్న పూనమ్ గుప్తా… తన సహచరుడు సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న అవనీశ్ కుమార్ ను మనువాడనున్నారు. వాస్తవానికి పూనమ్ గుప్తా కూడా సీఆర్ పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రపతి ముర్ముకు వ్యక్తిగత భద్రతా అధికారిగా ఆమె డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.వెరసి వధూవరులిద్దరూ సీఆర్ పీఎఫ్ అధికారులే. ఈ కారణంగానే వీరి పెళ్లి వేడుకకు రాష్ట్రపతి భవన్ వేదికగా నిలుస్తోందని సమాచారం.
వాస్తవానికి రాష్ట్రపతి భవన్ లో ఇప్పటిదాకా ఓ ప్రైవేట్ కార్యక్రమం అన్నది జరిగిందే లేదు. ఎందరో రాష్ట్రపతులు, మరెందరో ప్రదానులు మారినా కూడా అందరూ రాష్ట్రపతి భవన్ విశిష్టతను కాపాడుతూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న ఇద్దరు కూడా దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్ పీఎఫ్ అధికారులు కావడం.. వారిలో ఒకరు నేరుగా రాష్ట్రపతి ముర్ముకు పర్సనల్ సెక్యూరిటీ ఆపీసర్ గా పనిచేస్తున్న కారణంగా రాష్ట్రపతి భవన్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలుస్తోంది. రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో ఈ శుభకార్యం జరగనుంది.
This post was last modified on February 1, 2025 10:21 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…