Political News

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్రాజెక్టుల‌పై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నాన‌ని.. ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్ మాట‌కు మాట అన్న‌ట్టుగా స్పందించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని సోది చెప్ప‌ద్దంటూ చుర‌క‌లు అంటించారు. అస‌లు కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిందేంటో లెక్క‌ల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. త్వ‌ర‌లోనే బ‌డ్జెట్ స‌మావేశాలు ఉన్నాయ‌ని, ద‌మ్ముంటే అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న సవాల్ రువ్వారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌.. పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేవ‌లం ఆర్భాటం చేస్తోంద‌ని.. ప్ర‌చారానికి ఎక్కువ‌-ప‌నికి త‌క్కువ అని త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టుల‌ను పండ‌బెట్టార‌ని (అభివృద్ధి లేద‌ని) వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌పైయుద్ధం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. తాను పిబ్ర‌వ‌రిలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. బ‌హిరంగ స‌భ పెడుతున్నాన‌ని కూడా తెలిపారు. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స్పందించారు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని కొంద‌రు సోది చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల ఊబిలోకి జారుకుంద‌న్నారు. మిగులు రాష్ట్రంలో పాల‌న మొద‌లు పెట్టిన కేసీఆర్‌… రాష్ట్రాన్ని 7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఊబిలోకి దించి వెళ్లిపోయార‌ని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన గ‌త ప్ర‌భుత్వం కేవ‌లం 18 వేల కోట్ల మేర‌కే రుణ మాఫీ చేసింద‌న్నారు. ఇది కూడా రైతుల చేతికి ఏమీ అంద‌లేద‌ని.. అది వ‌డ్డీల‌కే స‌రిపోయింద‌ని వ్యాఖ్యానించారు. తాము అధికారం చేప‌ట్టిన కేవ‌లం రెండు మాసాల్లోనే ఒక్కొక్క రైతుకు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున రుణ మాఫీ చేసిన‌ట్టురేవంత్రెడ్డి వివ‌రించారు. ఈ లెక్క‌లు త‌ప్ప‌ని నిరూపించ‌గ‌ల‌రా? అని కేసీఆర్ ను ప్ర‌శ్నించారు.

“అసెంబ్లీకి రా! ఎంత రుణ మాఫీ చేశామో.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రిస్తాం. గ‌త ప్ర‌భుత్వం ఎంత రుణ మాఫీ చేసిందో కూడా లెక్క‌లు చూపిస్తాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్‌కే కాదు.. ఆయ‌న మాట‌ల‌కు కూడా నిజాయితీ… చిత్త‌శుద్ధి లేవ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతు భ‌రోసా ఎగ్గొట్ట‌డానికి.. కేసీఆర్ పాల‌న కాద‌ని… కాంగ్రెస్ పాల‌న అని చెప్పారు. ఎన్నిక‌ల కుముందు ఇచ్చిన ప్ర‌తి గ్యారెంటీని తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం చెప్పారు. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని, వారికి మూడు ఎక‌రాలు ఇస్తామ‌ని, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టించి ఇస్తామ‌ని చెప్పి.. త‌ప్పించుకున్న‌వారిని తెలంగాణ స‌మాజం మ‌రిచిపోలేద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on January 31, 2025 10:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

5 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

5 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

6 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

6 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

9 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

10 hours ago