Political News

ఏపీకే ఆ 100 కోట్ల డ్రోన్ పెట్టుబడులు

భారత్ లో డ్రోన్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనూ ఏపీలోని కూటమి సర్కారు డ్రోన్ టెక్నాలజీకి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమరావతిలో డ్రోన్ టెక్నాలజీపై జాతీయ సదస్సును నిర్వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు..ఈ రంగానికి బూస్ట్ ఇచ్చే ప్రకటనలు చేశారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు 300 ఎకరాలను కేటాయిస్తూ కీలక ప్రకటన చేశారు.

ఈ ప్రకటన డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఉన్న పలు కంపెనీలను బాగానే టెంప్ట్ చేశాయని చెప్పాలి. చంద్రబాబు ప్రకటన, ఓర్వకల్లులో ప్రభుత్వం కేటాయించిన భూములు, ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితరాలపై ఆయా కంపెనీలు దృష్టి సారించాయి.

ఈ పరిశీలనలను అందరికంటే ముందుగా పూర్తి చేసుకున్న చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ కంపెనీ అధినేత అగ్నీశ్వర్ జయప్రకాశ్… గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. డ్రోన్ సిటీ ఏర్పాటు దిశగా తాము ఓ ప్రాజెక్టు చేపట్టాలనుకుంటున్నామని… అందుకోసం తమ వంతుగా రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ డ్రోన్ సిటీని కేవలం ప్రైవేట్ కంపెనీలు మాత్రమే డెవలప్ చేయడం సాధ్యం కాదని చెప్పిన జయప్రకాశ్… అందుకు కేంద్రం తరఫున సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. ఓర్వకల్లులో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూములు… అక్కడ డ్రోన్ టెక్నాలజీ సంస్థలకు గల అవకాశాలప వారి మధ్య చర్చ జరిగింది.

జయప్రకాశ్ ప్రతిపాదనకు రామ్మోహన్ నాయుడు అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. అంతేకాకుండా ఏపీలోనే సదరు డ్రోన్ సిటీని డెవలప్ చేసే దిశగా కూటమి సర్కారుతో చర్చిద్దామని కూడా మంత్రి ఆయనకు జయప్రకాశ్ కు హామీ ఇచ్చారు. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలో ఈ పెట్టుబడులు ఏపీకి రావడం ఖాయమనే చెప్పాలి.

This post was last modified on January 31, 2025 7:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

9 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

38 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago