Political News

ఏపీకే ఆ 100 కోట్ల డ్రోన్ పెట్టుబడులు

భారత్ లో డ్రోన్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనూ ఏపీలోని కూటమి సర్కారు డ్రోన్ టెక్నాలజీకి ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమరావతిలో డ్రోన్ టెక్నాలజీపై జాతీయ సదస్సును నిర్వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు..ఈ రంగానికి బూస్ట్ ఇచ్చే ప్రకటనలు చేశారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు 300 ఎకరాలను కేటాయిస్తూ కీలక ప్రకటన చేశారు.

ఈ ప్రకటన డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఉన్న పలు కంపెనీలను బాగానే టెంప్ట్ చేశాయని చెప్పాలి. చంద్రబాబు ప్రకటన, ఓర్వకల్లులో ప్రభుత్వం కేటాయించిన భూములు, ఏపీలో పెట్టుబడులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితరాలపై ఆయా కంపెనీలు దృష్టి సారించాయి.

ఈ పరిశీలనలను అందరికంటే ముందుగా పూర్తి చేసుకున్న చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ కంపెనీ అధినేత అగ్నీశ్వర్ జయప్రకాశ్… గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. డ్రోన్ సిటీ ఏర్పాటు దిశగా తాము ఓ ప్రాజెక్టు చేపట్టాలనుకుంటున్నామని… అందుకోసం తమ వంతుగా రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ డ్రోన్ సిటీని కేవలం ప్రైవేట్ కంపెనీలు మాత్రమే డెవలప్ చేయడం సాధ్యం కాదని చెప్పిన జయప్రకాశ్… అందుకు కేంద్రం తరఫున సహకారం అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా డ్రోన్ టెక్నాలజీపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. ఓర్వకల్లులో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూములు… అక్కడ డ్రోన్ టెక్నాలజీ సంస్థలకు గల అవకాశాలప వారి మధ్య చర్చ జరిగింది.

జయప్రకాశ్ ప్రతిపాదనకు రామ్మోహన్ నాయుడు అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. అంతేకాకుండా ఏపీలోనే సదరు డ్రోన్ సిటీని డెవలప్ చేసే దిశగా కూటమి సర్కారుతో చర్చిద్దామని కూడా మంత్రి ఆయనకు జయప్రకాశ్ కు హామీ ఇచ్చారు. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలో ఈ పెట్టుబడులు ఏపీకి రావడం ఖాయమనే చెప్పాలి.

This post was last modified on January 31, 2025 7:15 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago