Political News

పెమ్మసానిని అంబటి నిలువరించగలరా..?

ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికార, విపక్షాల మధ్య ఇప్పుడు రసవత్తర రాజకీయం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మునిసిపాలిటీలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలు కాగా… శుక్రవారం గుంటూరులోనూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. హిందూపురంలో చైర్ పర్సన్ పదవి కోసం టీడీపీ, వైసీపీల మధ్య పోరు సాగుతుంటే… గుంటూరులో కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా క్యాంపు రాజకీయీలు మొదలు కావడం గమనార్హం.

వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చాలా మునిసిపాలిటీలతో పాటుగా గుంటూరు కార్పొరేషన్ కూడా ఆ పార్టీ చేతికే చిక్కింది. గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 58 వార్డులు ఉండగా… ఎన్నికల సమయంలో వైసీపీ 47 స్థానాల్లో గెలిచింది. టీడీపీకి 9, జనసేనకు 2 సీట్లు దక్కాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే… వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. తాజాగా మరో ఇద్దరు కూడా టీడీపీలో చేరారు. ఇంకో ముగ్గురు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ బలం జనసేనతో కలుపుకుని 21కి చేరగా… వైసీపీ బలం 37గా ఉంది. ఈ బలాలు ఇలాగే కొనసాగితే… వైసీపీని కట్టడి చేయడం కుదరదు.

ఇలాంటి కీలక తరుణంలో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగిపోయారు. టీడీపీ వైపు చూస్తున్న కార్పొరేటర్లను లాగేసుకునేందుకు ఆయన పక్కా వ్యూహాలు రచించారు. ఎలాగైనా కార్పొరేషన్ లో టీడీపీ మెజారిటీ సాధించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక పార్టీ తరఫున గెలిచిన, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు జారిపోకుండా మొత్తం 21 మందిని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల దాకా వారిని క్యాంపుల్లోనే ఉంచనున్నారు. కొత్తగా ఎవరైనా పార్టీలోకి వస్తే… వారిని కూడా క్యాంపులకు తరలించనున్నారు.

పెమ్మసాని స్పీడును చూసిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు జారి పోకుండా వారందరినీ ఆయన కూడా క్యాంపునకు తరలించారు. పెమ్మసాని మాదిరే వైసీపీ కార్పొరేటర్లను కూడా అంబటి ఫిబ్రవరి 3న నేరుగా కార్పొరేషన్ భేటీకి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ శిబిరంలోని చాలా మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపుగా వైసీపీ శిబిరంలోని 10 మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు సమాచారం. వారంతా టీడీపీలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి వారిని నిలువరించుకుని పెమ్మసాని వ్యూహాలకు అంబటి చెక్ పెట్టగలరా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

This post was last modified on January 31, 2025 6:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

7 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

36 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

3 hours ago