Political News

పెమ్మసానిని అంబటి నిలువరించగలరా..?

ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికార, విపక్షాల మధ్య ఇప్పుడు రసవత్తర రాజకీయం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మునిసిపాలిటీలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలు కాగా… శుక్రవారం గుంటూరులోనూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. హిందూపురంలో చైర్ పర్సన్ పదవి కోసం టీడీపీ, వైసీపీల మధ్య పోరు సాగుతుంటే… గుంటూరులో కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా క్యాంపు రాజకీయీలు మొదలు కావడం గమనార్హం.

వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చాలా మునిసిపాలిటీలతో పాటుగా గుంటూరు కార్పొరేషన్ కూడా ఆ పార్టీ చేతికే చిక్కింది. గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 58 వార్డులు ఉండగా… ఎన్నికల సమయంలో వైసీపీ 47 స్థానాల్లో గెలిచింది. టీడీపీకి 9, జనసేనకు 2 సీట్లు దక్కాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే… వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. తాజాగా మరో ఇద్దరు కూడా టీడీపీలో చేరారు. ఇంకో ముగ్గురు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ బలం జనసేనతో కలుపుకుని 21కి చేరగా… వైసీపీ బలం 37గా ఉంది. ఈ బలాలు ఇలాగే కొనసాగితే… వైసీపీని కట్టడి చేయడం కుదరదు.

ఇలాంటి కీలక తరుణంలో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగిపోయారు. టీడీపీ వైపు చూస్తున్న కార్పొరేటర్లను లాగేసుకునేందుకు ఆయన పక్కా వ్యూహాలు రచించారు. ఎలాగైనా కార్పొరేషన్ లో టీడీపీ మెజారిటీ సాధించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక పార్టీ తరఫున గెలిచిన, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు జారిపోకుండా మొత్తం 21 మందిని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల దాకా వారిని క్యాంపుల్లోనే ఉంచనున్నారు. కొత్తగా ఎవరైనా పార్టీలోకి వస్తే… వారిని కూడా క్యాంపులకు తరలించనున్నారు.

పెమ్మసాని స్పీడును చూసిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు జారి పోకుండా వారందరినీ ఆయన కూడా క్యాంపునకు తరలించారు. పెమ్మసాని మాదిరే వైసీపీ కార్పొరేటర్లను కూడా అంబటి ఫిబ్రవరి 3న నేరుగా కార్పొరేషన్ భేటీకి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ శిబిరంలోని చాలా మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపుగా వైసీపీ శిబిరంలోని 10 మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు సమాచారం. వారంతా టీడీపీలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి వారిని నిలువరించుకుని పెమ్మసాని వ్యూహాలకు అంబటి చెక్ పెట్టగలరా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

This post was last modified on January 31, 2025 6:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

32 minutes ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

45 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

2 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

4 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 hours ago