Political News

పెమ్మసానిని అంబటి నిలువరించగలరా..?

ఏపీలోని పలు ప్రాంతాల్లో అధికార, విపక్షాల మధ్య ఇప్పుడు రసవత్తర రాజకీయం సాగుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మునిసిపాలిటీలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలు కాగా… శుక్రవారం గుంటూరులోనూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. హిందూపురంలో చైర్ పర్సన్ పదవి కోసం టీడీపీ, వైసీపీల మధ్య పోరు సాగుతుంటే… గుంటూరులో కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా క్యాంపు రాజకీయీలు మొదలు కావడం గమనార్హం.

వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చాలా మునిసిపాలిటీలతో పాటుగా గుంటూరు కార్పొరేషన్ కూడా ఆ పార్టీ చేతికే చిక్కింది. గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 58 వార్డులు ఉండగా… ఎన్నికల సమయంలో వైసీపీ 47 స్థానాల్లో గెలిచింది. టీడీపీకి 9, జనసేనకు 2 సీట్లు దక్కాయి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే… వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. తాజాగా మరో ఇద్దరు కూడా టీడీపీలో చేరారు. ఇంకో ముగ్గురు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీ బలం జనసేనతో కలుపుకుని 21కి చేరగా… వైసీపీ బలం 37గా ఉంది. ఈ బలాలు ఇలాగే కొనసాగితే… వైసీపీని కట్టడి చేయడం కుదరదు.

ఇలాంటి కీలక తరుణంలో గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగిపోయారు. టీడీపీ వైపు చూస్తున్న కార్పొరేటర్లను లాగేసుకునేందుకు ఆయన పక్కా వ్యూహాలు రచించారు. ఎలాగైనా కార్పొరేషన్ లో టీడీపీ మెజారిటీ సాధించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇక పార్టీ తరఫున గెలిచిన, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు జారిపోకుండా మొత్తం 21 మందిని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల దాకా వారిని క్యాంపుల్లోనే ఉంచనున్నారు. కొత్తగా ఎవరైనా పార్టీలోకి వస్తే… వారిని కూడా క్యాంపులకు తరలించనున్నారు.

పెమ్మసాని స్పీడును చూసిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రంగంలోకి దిగిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు జారి పోకుండా వారందరినీ ఆయన కూడా క్యాంపునకు తరలించారు. పెమ్మసాని మాదిరే వైసీపీ కార్పొరేటర్లను కూడా అంబటి ఫిబ్రవరి 3న నేరుగా కార్పొరేషన్ భేటీకి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ శిబిరంలోని చాలా మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపుగా వైసీపీ శిబిరంలోని 10 మంది కార్పొరేటర్లతో పెమ్మసాని చర్చలు జరిపినట్లు సమాచారం. వారంతా టీడీపీలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి వారిని నిలువరించుకుని పెమ్మసాని వ్యూహాలకు అంబటి చెక్ పెట్టగలరా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

24 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago