Political News

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయ్‌.. మొద‌లైన ప్ర‌క్రియ‌..!

ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల‌ను పెంచే క్ర‌తువు ప్రారంభం కానుంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. రాష్ట్రానికి మ‌రో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక‌, నియోజ‌క ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ప్ర‌కారం.. 5-8 పార్ల‌మెంటు స్థానాలు కూడా పెర‌గాల్సి ఉంది. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్నా.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. కానీ, పార్టీల‌కు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే.. త‌మకు ఇబ్బందులు త‌ప్పుతాయ‌న్న అభిప్రాయం క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. యువ‌త‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్న పార్టీలు క‌నిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో అనూహ్య కార‌ణాల‌తో కొత్త నేత‌లు కూడా అప్ప‌టిక‌ప్పుడు పుట్టుకువ‌స్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు బాప‌ట్ల ఎంపీ.. కృష్ణ ప్ర‌సాద్ కొత్త నాయ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కు రాజకీయ నేప‌థ్యం త‌క్కువే. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న టికెట్ పొందారు. దీనివ‌ల్ల‌.. సీనియ‌ర్లు, టికెట్ ఆశించిన వారు కూడా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సిట్టింగుల‌ను త‌ప్పించారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కొత్త‌త‌రం నాయ‌కుల‌ను రాజ‌కీయాల‌కు ప‌రిచయం చేస్తోంది. దీంతో సీనియర్ల‌ను త‌ప్పించి.. సామాజిక వ‌ర్గాల ఆధారంగా టికెట్ల‌ను పంపిణీ చేసింది.ఈ రెండు పార్టీల ప‌రిస్థితి నాయకులు ఎక్కువ‌-అవ‌కాశాలు త‌క్కువ అన్న‌ట్టుగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీలు రెండూ కూడా.. గ‌తంలో అధికారంలో ఉన‌ప్పుడు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై క‌స‌ర‌త్తు చేశాయి. 2017-18 మ‌ధ్య చంద్ర‌బాబు దీనిపై పెద్ద తీర్మాన‌మే చేసి కేంద్రానికి ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. 2026 వ‌ర‌కు కుద‌ర‌ద‌ని అప్ప‌ట్లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ, తెలంగాణ‌ల‌కు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అసెంబ్లీ, దేశ‌వ్యాప్తంగా జ‌నాభా ఆధారంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిపై పార్ల‌మెంటు ఆమోదం పొందాల్సిన నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న బ‌డ్జట్ స‌మావేశాల రెండో విడ‌త‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌పై ముసాయిదా బిల్లును తీసుకురానున్న‌ట్టు తెలిసింది. ఈ ప్ర‌క్రియ ఇప్పుడు మొద‌లైతే.. ఆరు మాసాల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. దీనిని తిరిగి ఈ ఏడాది ఆమోదిస్తే.. వ‌చ్చే ఏడాది నుంచి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

This post was last modified on January 31, 2025 3:57 pm

Share

Recent Posts

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

2 hours ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

5 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

7 hours ago

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

9 hours ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

10 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

16 hours ago