ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను పెంచే క్రతువు ప్రారంభం కానుంది. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి మరో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక, నియోజక ర్గాల పునర్ విభజన ప్రకారం.. 5-8 పార్లమెంటు స్థానాలు కూడా పెరగాల్సి ఉంది. వీటిపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నా.. అడుగులు ముందుకు పడడం లేదు. కానీ, పార్టీలకు మాత్రం నియోజకవర్గాలు పెంచితే.. తమకు ఇబ్బందులు తప్పుతాయన్న అభిప్రాయం కనిపిస్తోంది.
రాష్ట్రంలో నాయకుల సంఖ్య పెరుగుతోంది. యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న పార్టీలు కనిపిస్తున్నాయి. అదేసమయంలో అనూహ్య కారణాలతో కొత్త నేతలు కూడా అప్పటికప్పుడు పుట్టుకువస్తున్నారు. ఉదాహరణకు బాపట్ల ఎంపీ.. కృష్ణ ప్రసాద్ కొత్త నాయకుడు. అప్పటి వరకు రాజకీయ నేపథ్యం తక్కువే. కానీ, ఎన్నికల సమయంలో ఆయన టికెట్ పొందారు. దీనివల్ల.. సీనియర్లు, టికెట్ ఆశించిన వారు కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఇతర నియోజకవర్గాల్లోనూ.. సిట్టింగులను తప్పించారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. కొత్తతరం నాయకులను రాజకీయాలకు పరిచయం చేస్తోంది. దీంతో సీనియర్లను తప్పించి.. సామాజిక వర్గాల ఆధారంగా టికెట్లను పంపిణీ చేసింది.ఈ రెండు పార్టీల పరిస్థితి నాయకులు ఎక్కువ-అవకాశాలు తక్కువ అన్నట్టుగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీలు రెండూ కూడా.. గతంలో అధికారంలో ఉనప్పుడు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు చేశాయి. 2017-18 మధ్య చంద్రబాబు దీనిపై పెద్ద తీర్మానమే చేసి కేంద్రానికి ఇచ్చారు.
అయినప్పటికీ.. 2026 వరకు కుదరదని అప్పట్లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ, తెలంగాణలకు పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ, దేశవ్యాప్తంగా జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీనిపై పార్లమెంటు ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జట్ సమావేశాల రెండో విడతలో నియోజకవర్గాల పునర్ విభజనపై ముసాయిదా బిల్లును తీసుకురానున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలైతే.. ఆరు మాసాల సమయం పట్టనుంది. దీనిని తిరిగి ఈ ఏడాది ఆమోదిస్తే.. వచ్చే ఏడాది నుంచి నియోజకవర్గాల పెంపు జరుగుతుందని భావిస్తున్నారు.
This post was last modified on January 31, 2025 3:57 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…