ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను పెంచే క్రతువు ప్రారంభం కానుంది. విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి మరో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక, నియోజక ర్గాల పునర్ విభజన ప్రకారం.. 5-8 పార్లమెంటు స్థానాలు కూడా పెరగాల్సి ఉంది. వీటిపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నా.. అడుగులు ముందుకు పడడం లేదు. కానీ, పార్టీలకు మాత్రం నియోజకవర్గాలు పెంచితే.. తమకు ఇబ్బందులు తప్పుతాయన్న అభిప్రాయం కనిపిస్తోంది.
రాష్ట్రంలో నాయకుల సంఖ్య పెరుగుతోంది. యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న పార్టీలు కనిపిస్తున్నాయి. అదేసమయంలో అనూహ్య కారణాలతో కొత్త నేతలు కూడా అప్పటికప్పుడు పుట్టుకువస్తున్నారు. ఉదాహరణకు బాపట్ల ఎంపీ.. కృష్ణ ప్రసాద్ కొత్త నాయకుడు. అప్పటి వరకు రాజకీయ నేపథ్యం తక్కువే. కానీ, ఎన్నికల సమయంలో ఆయన టికెట్ పొందారు. దీనివల్ల.. సీనియర్లు, టికెట్ ఆశించిన వారు కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఇతర నియోజకవర్గాల్లోనూ.. సిట్టింగులను తప్పించారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. కొత్తతరం నాయకులను రాజకీయాలకు పరిచయం చేస్తోంది. దీంతో సీనియర్లను తప్పించి.. సామాజిక వర్గాల ఆధారంగా టికెట్లను పంపిణీ చేసింది.ఈ రెండు పార్టీల పరిస్థితి నాయకులు ఎక్కువ-అవకాశాలు తక్కువ అన్నట్టుగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీలు రెండూ కూడా.. గతంలో అధికారంలో ఉనప్పుడు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు చేశాయి. 2017-18 మధ్య చంద్రబాబు దీనిపై పెద్ద తీర్మానమే చేసి కేంద్రానికి ఇచ్చారు.
అయినప్పటికీ.. 2026 వరకు కుదరదని అప్పట్లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ, తెలంగాణలకు పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ, దేశవ్యాప్తంగా జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాలను పెంచేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీనిపై పార్లమెంటు ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జట్ సమావేశాల రెండో విడతలో నియోజకవర్గాల పునర్ విభజనపై ముసాయిదా బిల్లును తీసుకురానున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలైతే.. ఆరు మాసాల సమయం పట్టనుంది. దీనిని తిరిగి ఈ ఏడాది ఆమోదిస్తే.. వచ్చే ఏడాది నుంచి నియోజకవర్గాల పెంపు జరుగుతుందని భావిస్తున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…