Political News

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయ్‌.. మొద‌లైన ప్ర‌క్రియ‌..!

ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల‌ను పెంచే క్ర‌తువు ప్రారంభం కానుంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. రాష్ట్రానికి మ‌రో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక‌, నియోజ‌క ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ప్ర‌కారం.. 5-8 పార్ల‌మెంటు స్థానాలు కూడా పెర‌గాల్సి ఉంది. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్నా.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. కానీ, పార్టీల‌కు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే.. త‌మకు ఇబ్బందులు త‌ప్పుతాయ‌న్న అభిప్రాయం క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. యువ‌త‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్న పార్టీలు క‌నిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో అనూహ్య కార‌ణాల‌తో కొత్త నేత‌లు కూడా అప్ప‌టిక‌ప్పుడు పుట్టుకువ‌స్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు బాప‌ట్ల ఎంపీ.. కృష్ణ ప్ర‌సాద్ కొత్త నాయ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కు రాజకీయ నేప‌థ్యం త‌క్కువే. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న టికెట్ పొందారు. దీనివ‌ల్ల‌.. సీనియ‌ర్లు, టికెట్ ఆశించిన వారు కూడా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సిట్టింగుల‌ను త‌ప్పించారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కొత్త‌త‌రం నాయ‌కుల‌ను రాజ‌కీయాల‌కు ప‌రిచయం చేస్తోంది. దీంతో సీనియర్ల‌ను త‌ప్పించి.. సామాజిక వ‌ర్గాల ఆధారంగా టికెట్ల‌ను పంపిణీ చేసింది.ఈ రెండు పార్టీల ప‌రిస్థితి నాయకులు ఎక్కువ‌-అవ‌కాశాలు త‌క్కువ అన్న‌ట్టుగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీలు రెండూ కూడా.. గ‌తంలో అధికారంలో ఉన‌ప్పుడు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై క‌స‌ర‌త్తు చేశాయి. 2017-18 మ‌ధ్య చంద్ర‌బాబు దీనిపై పెద్ద తీర్మాన‌మే చేసి కేంద్రానికి ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. 2026 వ‌ర‌కు కుద‌ర‌ద‌ని అప్ప‌ట్లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ, తెలంగాణ‌ల‌కు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అసెంబ్లీ, దేశ‌వ్యాప్తంగా జ‌నాభా ఆధారంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిపై పార్ల‌మెంటు ఆమోదం పొందాల్సిన నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న బ‌డ్జట్ స‌మావేశాల రెండో విడ‌త‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌పై ముసాయిదా బిల్లును తీసుకురానున్న‌ట్టు తెలిసింది. ఈ ప్ర‌క్రియ ఇప్పుడు మొద‌లైతే.. ఆరు మాసాల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. దీనిని తిరిగి ఈ ఏడాది ఆమోదిస్తే.. వ‌చ్చే ఏడాది నుంచి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

This post was last modified on January 31, 2025 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago