Political News

అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయ్‌.. మొద‌లైన ప్ర‌క్రియ‌..!

ఏపీలో అన్ని రాజ‌కీయ పార్టీలు ఎదురు చూస్తున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల‌ను పెంచే క్ర‌తువు ప్రారంభం కానుంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. రాష్ట్రానికి మ‌రో 50 అసెంబ్లీ సీట్లు రావాల్సి ఉంది. ఇక‌, నియోజ‌క ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న ప్ర‌కారం.. 5-8 పార్ల‌మెంటు స్థానాలు కూడా పెర‌గాల్సి ఉంది. వీటిపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్నా.. అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. కానీ, పార్టీల‌కు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాలు పెంచితే.. త‌మకు ఇబ్బందులు త‌ప్పుతాయ‌న్న అభిప్రాయం క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. యువ‌త‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్న పార్టీలు క‌నిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో అనూహ్య కార‌ణాల‌తో కొత్త నేత‌లు కూడా అప్ప‌టిక‌ప్పుడు పుట్టుకువ‌స్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు బాప‌ట్ల ఎంపీ.. కృష్ణ ప్ర‌సాద్ కొత్త నాయ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కు రాజకీయ నేప‌థ్యం త‌క్కువే. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న టికెట్ పొందారు. దీనివ‌ల్ల‌.. సీనియ‌ర్లు, టికెట్ ఆశించిన వారు కూడా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. సిట్టింగుల‌ను త‌ప్పించారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. కొత్త‌త‌రం నాయ‌కుల‌ను రాజ‌కీయాల‌కు ప‌రిచయం చేస్తోంది. దీంతో సీనియర్ల‌ను త‌ప్పించి.. సామాజిక వ‌ర్గాల ఆధారంగా టికెట్ల‌ను పంపిణీ చేసింది.ఈ రెండు పార్టీల ప‌రిస్థితి నాయకులు ఎక్కువ‌-అవ‌కాశాలు త‌క్కువ అన్న‌ట్టుగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీలు రెండూ కూడా.. గ‌తంలో అధికారంలో ఉన‌ప్పుడు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై క‌స‌ర‌త్తు చేశాయి. 2017-18 మ‌ధ్య చంద్ర‌బాబు దీనిపై పెద్ద తీర్మాన‌మే చేసి కేంద్రానికి ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. 2026 వ‌ర‌కు కుద‌ర‌ద‌ని అప్ప‌ట్లో కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ, తెలంగాణ‌ల‌కు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అసెంబ్లీ, దేశ‌వ్యాప్తంగా జ‌నాభా ఆధారంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. దీనిపై పార్ల‌మెంటు ఆమోదం పొందాల్సిన నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న బ‌డ్జట్ స‌మావేశాల రెండో విడ‌త‌లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌పై ముసాయిదా బిల్లును తీసుకురానున్న‌ట్టు తెలిసింది. ఈ ప్ర‌క్రియ ఇప్పుడు మొద‌లైతే.. ఆరు మాసాల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. దీనిని తిరిగి ఈ ఏడాది ఆమోదిస్తే.. వ‌చ్చే ఏడాది నుంచి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

This post was last modified on January 31, 2025 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

27 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago