కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకునేవారే. అయితే ఆ ముప్పును క్షణాల్లో గ్రహించిన ఆయన వెనువెంటనే తనను తాను సరిచేసుకుని వివాదానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. చాలా కాలంగా రాజకీయాల్లో సాగుతున్నా గానీ… ఎందుకనో రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తాను టార్గెట్ చేస్తున్న పార్టీలు, నేతలు ఎవరు?.. వారి ప్రయారిటీ ఏమిటన్న దానిపై రాహుల్ అంతగా అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఉయభ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది కదా. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘంగానే సాగిన తన ప్రసంగంలో రాష్ట్రపతి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత తన తల్లి సోనియా గాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి రాహుల్ గాంధీ పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ లను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు… రాష్ట్రపతి ప్రసంగంపై వారి స్పందనను కోరారు. ఈ ప్రశ్నలకు సోనియా సిద్ధమవుతుండగానే… ఒక్కసారిగా రాహుల్ గాంధీ ‘బోరింగ్’ అంటూ సంచలన కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ నోట ఈ మాట వినిపించినంతనే మీడియా ప్రతినిధులతో పాటుగా సోనియా, కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ తిన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ రాహుల్ వైపు సోనియా ఒకింత కోపంగా చూసినట్టున్నారు. రాహుల్ గాంధీ వెంటనే తేరుకున్నారు. సారీ అంటూ చెప్పేసిన రాహుల్ బోరింగ్ అన్న తన వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నట్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివాదం రేగరాదన్న భావనతో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్లుగా ఉందని అన్నారు. కీలకమైన అంశాలను వదిలేసి… మోదీ సర్కారు చెప్పిన అంశాలనే రాష్ట్రపతి వల్లెవేశారని ఆరోపించారు. ఇలా మాట్లాడకుండా రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయినా… బోరింగ్ అన్న వ్యాఖ్యల వెంటనే సారీ చెప్పకపోయినా… ఈ అంశంపై పెను వివాదమే రేగి ఉండేది.
This post was last modified on January 31, 2025 3:36 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…