కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకునేవారే. అయితే ఆ ముప్పును క్షణాల్లో గ్రహించిన ఆయన వెనువెంటనే తనను తాను సరిచేసుకుని వివాదానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. చాలా కాలంగా రాజకీయాల్లో సాగుతున్నా గానీ… ఎందుకనో రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తాను టార్గెట్ చేస్తున్న పార్టీలు, నేతలు ఎవరు?.. వారి ప్రయారిటీ ఏమిటన్న దానిపై రాహుల్ అంతగా అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఉయభ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది కదా. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘంగానే సాగిన తన ప్రసంగంలో రాష్ట్రపతి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత తన తల్లి సోనియా గాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి రాహుల్ గాంధీ పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ లను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు… రాష్ట్రపతి ప్రసంగంపై వారి స్పందనను కోరారు. ఈ ప్రశ్నలకు సోనియా సిద్ధమవుతుండగానే… ఒక్కసారిగా రాహుల్ గాంధీ ‘బోరింగ్’ అంటూ సంచలన కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ నోట ఈ మాట వినిపించినంతనే మీడియా ప్రతినిధులతో పాటుగా సోనియా, కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ తిన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ రాహుల్ వైపు సోనియా ఒకింత కోపంగా చూసినట్టున్నారు. రాహుల్ గాంధీ వెంటనే తేరుకున్నారు. సారీ అంటూ చెప్పేసిన రాహుల్ బోరింగ్ అన్న తన వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నట్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివాదం రేగరాదన్న భావనతో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్లుగా ఉందని అన్నారు. కీలకమైన అంశాలను వదిలేసి… మోదీ సర్కారు చెప్పిన అంశాలనే రాష్ట్రపతి వల్లెవేశారని ఆరోపించారు. ఇలా మాట్లాడకుండా రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయినా… బోరింగ్ అన్న వ్యాఖ్యల వెంటనే సారీ చెప్పకపోయినా… ఈ అంశంపై పెను వివాదమే రేగి ఉండేది.
This post was last modified on January 31, 2025 3:36 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…