Political News

నోరు జారి.. సారీ చెప్పిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకునేవారే. అయితే ఆ ముప్పును క్షణాల్లో గ్రహించిన ఆయన వెనువెంటనే తనను తాను సరిచేసుకుని వివాదానికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. చాలా కాలంగా రాజకీయాల్లో సాగుతున్నా గానీ… ఎందుకనో రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. తాను టార్గెట్ చేస్తున్న పార్టీలు, నేతలు ఎవరు?.. వారి ప్రయారిటీ ఏమిటన్న దానిపై రాహుల్ అంతగా అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఉయభ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది కదా. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సుదీర్ఘంగానే సాగిన తన ప్రసంగంలో రాష్ట్రపతి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత తన తల్లి సోనియా గాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి రాహుల్ గాంధీ పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ లను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు… రాష్ట్రపతి ప్రసంగంపై వారి స్పందనను కోరారు. ఈ ప్రశ్నలకు సోనియా సిద్ధమవుతుండగానే… ఒక్కసారిగా రాహుల్ గాంధీ ‘బోరింగ్’ అంటూ సంచలన కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ నోట ఈ మాట వినిపించినంతనే మీడియా ప్రతినిధులతో పాటుగా సోనియా, కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ తిన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంపై అలాంటి కామెంట్లు చేస్తావా? అంటూ రాహుల్ వైపు సోనియా ఒకింత కోపంగా చూసినట్టున్నారు. రాహుల్ గాంధీ వెంటనే తేరుకున్నారు. సారీ అంటూ చెప్పేసిన రాహుల్ బోరింగ్ అన్న తన వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నట్లుగా వ్యవహరించారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివాదం రేగరాదన్న భావనతో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించినట్లుగా ఉందని అన్నారు. కీలకమైన అంశాలను వదిలేసి… మోదీ సర్కారు చెప్పిన అంశాలనే రాష్ట్రపతి వల్లెవేశారని ఆరోపించారు. ఇలా మాట్లాడకుండా రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయినా… బోరింగ్ అన్న వ్యాఖ్యల వెంటనే సారీ చెప్పకపోయినా… ఈ అంశంపై పెను వివాదమే రేగి ఉండేది.

This post was last modified on January 31, 2025 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago